తెలంగాణలో భూముల విలువ ఎక్కడ ఎంత పెరిగాయంటే?

తెలంగాణలో భూముల విలువలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇళ్లు, అపార్ట్ మెంట్ల మార్కెట్ విలువను 50 శాతం పెంచింది. అమలు తేదీని మాత్రం ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. వ్యవసాయేతర ఆస్తుల విలువ బాగా తక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో రెట్టింపు అయ్యే సూచనలున్నాయి. సగటున వ్యవసాయేతర భూములు, ఇళ్ల విలువ 25 నుంచి 50 శాతం వరకు పెరిగింది. అపార్ట్ మెంట్లలో ప్లాట్ల విలువను ప్రాంతాల వారీగా 20 నుంచి […]

Written By: Srinivas, Updated On : July 17, 2021 10:12 am
Follow us on

తెలంగాణలో భూముల విలువలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇళ్లు, అపార్ట్ మెంట్ల మార్కెట్ విలువను 50 శాతం పెంచింది. అమలు తేదీని మాత్రం ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. వ్యవసాయేతర ఆస్తుల విలువ బాగా తక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో రెట్టింపు అయ్యే సూచనలున్నాయి. సగటున వ్యవసాయేతర భూములు, ఇళ్ల విలువ 25 నుంచి 50 శాతం వరకు పెరిగింది.

అపార్ట్ మెంట్లలో ప్లాట్ల విలువను ప్రాంతాల వారీగా 20 నుంచి 50 శాతం వరకు అధికారులు పెంచారు కొన్ని ప్రాంతాల్లో ఇది 80 శాతంగా ఉంది. పురపాలక సంఘాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సగటున పెరుగుదల 33 శాతంగా ఉంది. గ్రేటర్ పరిధిలో అపార్ట్ మెంట్ ప్లాట్ల విలువ 20 శాతం నుంచి గరిష్టంగా 50 శాతం వరకు పెరిగింది. కొన్ని మండల కేంద్రాల్లో ఇది 50 శాతంగా ఉంది. స్టాంపులు, రిజిస్రేషన్ శాఖ పెంపు ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలిస్తోంది.

ఇళ్ల స్థలాల భూమి చదరపు గజం విలువ రూ. 300 ఉండగా తజాగా దీన్ని 500 కు పెంచారు. ఇళ్లకు సంబంధించి చదరపు అడుగు రూ.900 ఉండగా దీన్ని రూ.1200గా నిర్ణయించారు. పరిగి పురపాలక సంఘంలో గతంలో గరిష్ట చదరపు గజం భూమి విలువ రూ.7000 కాగా దీన్ని రూ9250గా పెంచారు. తాండూరులో రూ.7000 నుంచి రూ.9250కి పెరిగింది. రాష్ర్ట స్టాంపులు రిజిస్టేషన్ శాఖకు అత్యధిక రాబడిని తెచ్చే రంగారెడ్డి జిల్లా పరిధిలోని ప్రాంతాల వారీగా వ్యవసాయేతర భూముల ఆస్తుల విలువను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ర్టంలో రిజిస్టేషన్ చార్జీుల మొత్తం ఆరు శాతంగా ఉన్నాయి. ఇందులో స్టాంపు డ్యూటీ 4 శాతం కాగా ట్రాన్స్ ఫ్ డ్యూటీ 1 శాతంగా రిజిస్రేషన్ ఫీజు 0.5 శాతంగా ఉంది. తాజాగా స్టాంపు డ్యూటీని 5 శాతానికి పెంచేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో రిజిస్రేషన్ చార్జీలు 7 శాతానికి పెరుగుతాయి. ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆ శాఖ ముఖ్య అధికారి ఒకరు తెలిపారు.