spot_img
Homeఆంధ్రప్రదేశ్‌JNTU Campus: క్యాంపస్ లో శోభనం.. యూనివర్సిటీలో ప్రొఫెసర్ హనీమూన్

JNTU Campus: క్యాంపస్ లో శోభనం.. యూనివర్సిటీలో ప్రొఫెసర్ హనీమూన్

First Night at JNTU CampusKakinada JNTU Campus: చదువులమ్మ ఒడిని శోభనం గదిగా మార్చిన సంఘటన కాకినాడలో వెలుగుచూసింది. జేఎన్ టీయూ క్యాంపస్ ను(JNTU Campus) బెడ్ రూంగా మార్చడంతో అందరిలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. సరస్వతీ నిలయంలో ఇలాంటి పాడు పనులు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. క్యాంపస్ సిబ్బందిపై విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. విశ్వవిద్యాలయం అతిథి గృహాన్ని హనీమూన్ సెంటర్ గా మార్చడంతో అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పవిత్రంగా చూసుకోవాల్సిన నిలయాన్ని అపవిత్రంగా తయారు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

కాకినాడ జేఎన్టీయూ గెస్ట్ హౌస్ లో ఆగస్టు 18 రాత్రి నూతన దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. ఆగస్టు 18న ఉమెన్ ఎంపవర్ మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ.స్వర్ణకుమారి గెస్ట్ హౌస్ లో మూడు గదులను బుక్ చేసుకున్నారు. అందులో 201 గదిలో దంపతులకు అట్టహాసంగా శోభనం ఏర్పాటు చేశారు. వేడుకలకు గెస్ట్ హౌస్ వాడకూడదనే నిబంధనలు ఉన్నా పట్టించుకోలేదు. ప్రైవేటు కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని తెలిసినా అధికారుల నిర్లక్ష్యంతో ఇలా బుక్ చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

క్యాంపస్ ఏమైనా అత్తవారిల్లా అని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మూడు గదులను బుక్ చేసుకుని ఒక గదిలో శోభనం, మరో రెండు గదుల్లో పెళ్లి వేడుకలు నిర్వహించినట్లు తెలుస్తోంది. వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పేరుతో గదులు బుక్ చేసినా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో సిబ్బంది నిర్లక్ష్యం క నిపిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

యూనివర్సిటీ వ్యవహారాల నిమిత్తం వచ్చే అధికారులు, సిబ్బందికి ఈ గదులను అద్దెకు ఇస్తుంటారు. అంతేకానీ ఇక్కడ ప్రైవేటు కార్యకలాపాలకు తావు లేదు. ప్రైవేటు కార్యక్రమం కోసం అదీ కూడా శోభనం కోసం ఉపయోగించుకోవడం ఏమిటని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రైవేటు కార్యక్రమాలకు అనుమతి ఇచ్చిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper
Exit mobile version