ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం..!

పరిశ్రమల్లో ప్రమాదాలు చోటు ఇటీవల కాలంలో చేసుకుంటూనే ఉన్నాయి. విశాఖ ఎల్.జి పాలిమర్స్, చత్తీస్ ఘడ్ లో శక్తి పేపర్ మిల్, తమిళనాడులో మరో పరిశ్రమలో, పిడుగురాళ్ల లో సున్నం పరిశ్రమలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కంపెనీలో భారీగా మంటలు పడుతున్నాయి. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు సమీపంలోని పేర్నమిట్టలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలో ఉన్న మినోఫాం ఫార్మా పరిశ్రమలో కొంత కాలంగా […]

Written By: Neelambaram, Updated On : May 15, 2020 2:14 pm
Follow us on

పరిశ్రమల్లో ప్రమాదాలు చోటు ఇటీవల కాలంలో చేసుకుంటూనే ఉన్నాయి. విశాఖ ఎల్.జి పాలిమర్స్, చత్తీస్ ఘడ్ లో శక్తి పేపర్ మిల్, తమిళనాడులో మరో పరిశ్రమలో, పిడుగురాళ్ల లో సున్నం పరిశ్రమలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కంపెనీలో భారీగా మంటలు పడుతున్నాయి. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు సమీపంలోని పేర్నమిట్టలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలో ఉన్న మినోఫాం ఫార్మా పరిశ్రమలో కొంత కాలంగా శానిటైజర్లు తయారు చేస్తున్నారు.

శానిటైజర్లు తయారు చేసే క్రమంలో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. శానిటైజర్‌లలో ఉపయోగించే ఆల్కహాల్ కు మండే స్వభావం ఉండటంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. కాగా పరిశ్రమలోని రెండు ఫోర్లకు దట్టమైన పొగలు వ్యాప్తించడంతో భయంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.