రాష్ట్రంలో రెండు రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారిన విషయం మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ కేసు, ఆయన పంపిన లేఖ ఈ రెండు అంశాలలో విచారణలు సమాంతరంగా సాగిపోతున్నాయి. ఎస్ఈసీగా నిమ్మగడ్డ తొలగింపు విషయంలో మరో ట్విస్ట్ బయట పడింది. రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా పంచాయతీ రాజ్ చట్టంలో సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. మున్సిపల్ చట్టం ఎం చేబుతుందనేది న్యాయ పండితులు పరిశీలిస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు..!
మరోవైపు నిమ్మగడ్డ లేఖ విషయంలో ఇప్పటికే సీఐడీ అధికారులు అనేక విషయాలను రాబట్టారు. తాజాగా ఆ లేఖ ఎస్ఈసీ ఆఫీస్లో తయారు కాలేదని నిర్దారణ అయింది. ల్యాప్ టాప్, డెస్క్ టాప్లను పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణలు ఆ లేఖ ఎస్ఈసీ కార్యాలయంలో తయారు కాలేదని తేల్చారు. ఈ మేరకు సీఐడీ అధికారుల చేతికి ఫోరెన్సిక నివేదిక అందింది. ఇందుకు సంబంధించి సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. రమేష్ కుమార్ పీఏ సాంబమూర్తి అన్ని అసత్యాలే చెప్పారని అన్నారు.
ఆ లేఖను ముందుగానే తయారుచేశారని అది బయటి నుంచి వచ్చిందని తెలిపారు. మార్చి 18వ తేదీ ఉదయం పెన్డ్రైవ్లో ఆ లేఖ రమేష్ కుమార్ వద్దకు చేరిందన్నారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో త్వరలోనే తేలుస్తామని చెప్పారు. కాగా, రమేశ్ కుమార్ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాసిన లేఖపై తొలి నుంచి అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతో ఈ లేఖను టీడీపీ కార్యాలయంలో తయారైందని, ఆ లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీసీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను రమేష్ కుమార్ లేఖపై విచారణ చేపట్టాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ సందర్భంగా రమేశ్ కుమార్ చేసిన సంతకానికి, కేంద్ర హోంశాఖకు లేఖలో ఉన్న సంతకానికి అసలు పొంతన లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.