వరద పోయినా.. తగ్గని బురద

మహాగరం హైదరాబాద్‌లో ఇటీవల వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. చాలా మందికి కన్నీటిని మిగిల్చింది. ఇన్నాళ్లు కష్టపడి సంపాదించింది అంతా తన్నుకుపోయింది. కట్టుబట్టలు మినహా.. నిత్యావసర సరుకులు, బట్టలు, పిల్లల సర్టిఫికెట్లు మొత్తం నీటిపాలయ్యాయి. టీవీల వంటి ఎలక్ట్రానిక్‌ సామాన్లు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఇన్నాళ్లు పరాయి ప్రాంతాల్లో తలదాచుకుని వరద తగ్గడంతో సొంత ఇళ్లకు చేరుకుంటున్న ప్రజలు అక్కడి పరిస్థితిని చూసి గొల్లుమంటున్నారు. Also Read: పల్లె పల్లెన సద్దుల సంబురం వరదల్లో […]

Written By: NARESH, Updated On : October 24, 2020 2:16 pm
Follow us on

మహాగరం హైదరాబాద్‌లో ఇటీవల వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. చాలా మందికి కన్నీటిని మిగిల్చింది. ఇన్నాళ్లు కష్టపడి సంపాదించింది అంతా తన్నుకుపోయింది. కట్టుబట్టలు మినహా.. నిత్యావసర సరుకులు, బట్టలు, పిల్లల సర్టిఫికెట్లు మొత్తం నీటిపాలయ్యాయి. టీవీల వంటి ఎలక్ట్రానిక్‌ సామాన్లు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఇన్నాళ్లు పరాయి ప్రాంతాల్లో తలదాచుకుని వరద తగ్గడంతో సొంత ఇళ్లకు చేరుకుంటున్న ప్రజలు అక్కడి పరిస్థితిని చూసి గొల్లుమంటున్నారు.

Also Read: పల్లె పల్లెన సద్దుల సంబురం

వరదల్లో సర్వం కోల్పోయిన వారిలో ఎక్కువమంది మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన వారే. పైసాపైసా కూడబెట్టి కొనుక్కున్న వస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి. ఇళ్లు దెబ్బతిన్నాయి. వరద తగ్గి పది రోజులు కావస్తున్నా ఇంకా ఆ బాధలు మాత్రం తొలగడం లేదు. వరదల నుంచి భాగ్యనగరం కుదుటపడినా కాలనీల్లో పేరుకుపోయిన బురద మాత్రం అలాగే మిగిలిపోయింది. వరదతోపాటు భారీగా మట్టి కొట్టుకొచ్చింది.

రోడ్లపై ఉండిపోయిన మట్టిని జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగిస్తున్నా.. మూసీ పరివాహక ప్రాంతంలోని చాలా కాలనీల్లో చెత్త ఇంకా అలానే ఉంది. నదిలోని చెత్తాచెదారమంతా కాలనీల్లో మేట వేసింది. జీహెచ్‌ఎంసీ కార్మికులు ఇప్పటివరకూ దాదాపు 13వేల టన్నుల చెత్తను తొలగించారట. అంతేకాదు.. ముంపు ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లు, అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి చేరిన వరదనీరు ఇంకా పోనేలేదు. రోజూ చిన్నపాటి పంపుల ద్వారా ఆ నీటిని రోడ్లపైకి వదులుతూనే ఉన్నారు.

Also Read: ఓటుకు నోటు కేసు: రేవంత్, సండ్రలకు బిగుస్తున్న ఏసీబీ ఉచ్చు

తాగునీరు, కరెంట్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల మోటర్లు కాలిపోవడం, పాడైపోవడంతో నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నీటిని తోడుతున్నప్పటికీ ఊట సమస్య తలెత్తుతోంది. చెరువు, కుంటల పరివాహక ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. బల్దియా అధికారులు 600కు పైగా సెల్లార్లలోని నీటిని తోడినప్పటికీ మళ్లీ నీరు ఊరుతోంది. హైదరాబాద్‌లో 1300 పైగా సెల్లార్లు నీట మునిగినట్లుగా అధికారులు గుర్తించారు. నాచారం, సరూర్‌నగర్‌, కుత్బుల్లాపూర్‌, ఫాక్స్‌సాగర్‌ చెరువల నుంచి వస్తున్న ప్రవాహం తగ్గడంతో కాలనీల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సరూర్‌నగర్‌ చెరువు శాంతించినప్పటికీ వరద కాలనీల్లో రోడ్లు బురదయమయ్యాయి. ఉప్పల్‌ బండ్లగూడ చెరువుకు గండి కొట్టడంతో చుట్టుపక్కల ప్రాంతాలు ముంపులోనే కొనసాగుతున్నాయి. గుర్రం చెరువుకు గండి పడటంతో హఫీజ్‌ బాబానగర్‌ ఇంకా కోలుకోలేదు. వనస్థలిపురం సమీపంలోని కప్రాయ్‌ చెరువు బ్యాక్‌వాటర్‌ ఇంకా కొన్ని కాలనీల్లో పారుతోంది. ఈ ప్రాంతాల్లో నీరు ఇంకా పూర్తిగా తొలగాలంటే మరో వారం రోజులపైనే పట్టేలా కనిపిస్తోంది.