spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Essentials Prices: ఏపీలో నియంత్రణ లేని నిత్యవసరాల ధరలు

Essentials Prices: ఏపీలో నియంత్రణ లేని నిత్యవసరాల ధరలు

Essentials Prices: ఏపీలో నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. ఏం కొనలేం.. తినలేం అన్నట్టుంది పరిస్థితి. ముఖ్యంగా కరోనా తర్వాత పెరిగిన ధరలు అదుపులోకి రాలేదు. పైగా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఉదయం లేచింది మొదలు పాలు కొనుగోలు నుంచి.. పడుకునే ముందు వేసుకునే మందులు వరకు ధరల స్థిరీకరణ అంటూ లేదు. రెండు రోజుల ముందున్న ధర కూడా ఈరోజు లేకపోవడం విశేషం. అయితేధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకుంటున్నాయి. అయితే మన ఒక్క రాష్ట్రంలోనే ధరలు పెరిగాయి అనుకుంటే మనం పొరపడినట్టే. దాదాపు అన్ని రాష్ట్రాల్లో సైతం ధరలు ఇదే మాదిరిగా ఉండడం విశేషం

ప్రపంచ వ్యవసాయ వాణిజ్యంలో భారత్ కీలకం.కానీ అస్థిర వాతావరణ పరిస్థితులు, తీవ్ర వర్షాభావ పరిస్థితులు కారణంగా నిత్యవసరాల ధరలు దాదాపు 11 శాతం పెరిగాయి. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే మేల్కొన్నాయి. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. వాస్తవం చెప్పాలంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ధరలు అదుపులోకి రావడం లేదు. దీంతో సామాన్యుడికి ఏం తినాలో.. ఏం కొనాలో అర్థం కాని పరిస్థితి. ఆదాయ వనరుల పెరిగే పరిస్థితులు కానరాకపోయినా.. ధరలు మాత్రం కొండెక్కుతున్నాయి. గతంలో జేబులో డబ్బులు వేసుకుని సంచి తో సరుకులు తెచ్చుకునేవారు. కానీ ప్రస్తుతం సంచి తో డబ్బులు తీసుకెళ్లి జేబులో సరుకులు తెచ్చుకునే పరిస్థితి రావడం దురదృష్టకరం.

ధాన్యం ధరలు ధైర్యంగా ఉండగా.. బియ్యం ధరలు మాత్రం పైపైకి వెళుతున్నాయి. అంటే రైతు వద్ద ఉన్న ధాన్యం.. బియ్యం గా మారే క్రమంలో దళారులుగా ఉన్నవారు బాగుపడుతున్నట్టు ఇట్టే అర్థం అవుతుంది. పప్పులు, కూరగాయలు, నూనెలు వంటి వాటి విషయంలో చెప్పనక్కర్లేదు. నానాటికీ ఇవి ఖరీదైన వస్తువులుగా మారుతున్నాయి. కానీ ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తుంది. రకరకాల రాజకీయ కారణాలతో అటువైపు చూడడం మానేస్తుంది. దీంతో వ్యాపారులు, దళారులు కుమ్మక్కై కృత్రిమ కొరత సృష్టించి మరి సొమ్ము చేసుకోవడం విశేషం.

వాస్తవానికి ధరల నియంత్రణకు ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక కమిటీ ఉంటుంది. అది జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పనిచేస్తుంది. వివిధ శాఖలకు చెందిన 16 మంది అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లా పౌర సరఫరాల అధికారి కన్వీనర్ గా, అదనపు పాలన అధికారి, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, ఉద్యానవన శాఖ, మార్క్ఫెడ్, పౌర సరఫరాల సంస్థ డిఎం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు నిత్యవసర సరుకులతో సంబంధం ఉన్న అధికారులు ఈ కమిటీలు సభ్యులుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఈ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం కావాలి. ధరల నియంత్రణపై చర్చించాలి. క్షేత్రస్థాయిలో పరిశీలించి ధరలను అదుపు చేయాలి. కానీ ఏపీలో ఒక్కజిల్లాలో కూడా ఈ కమిటీ పర్యవేక్షించిన దాఖలాలు లేవు. దీంతో వ్యాపారులు, దళారులు రెచ్చిపోతున్నారు. నిత్యవసర ధరలు పెంచి, కృత్రిమ కొరత సృష్టించి మరి ప్రజలను దోచుకుంటున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper