spot_img
Homeజాతీయ వార్తలుకరోనాను జయించినా.. వివక్ష కొనసాగుతుందా?

కరోనాను జయించినా.. వివక్ష కొనసాగుతుందా?


మనం పోరాడాల్సింది కరోనా(కోవిడ్-19)తోగానీ.. రోగితో కాదు.. ఈ విషయంపై వైద్యులు, సామాజిక సంస్థలు, ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా.. ఎవరీలో మార్పురాకపోవడం శోచనీయంగా మారుతోంది. ప్రజలు కరోనా రోగులను దూరం పెడుతున్నారంటే ఓ అర్థం ఉందిగానీ.. కరోనాను జయించిన వారిపట్ల సమాజంలో వివక్ష కొనసాగుతుండటం అందరినీ ఆలోచింపజేస్తోంది. అసలు ప్రభుత్వాలు కరోనాపై సరైన రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరోనాను జయించామని సంతోషపడేలోపే చుట్టూ ఉండే ప్రజలు చూపే వివక్షతతో వారంతా మానసిక ఒత్తిడులకు గురవుతుండటం చర్చనీయాంశంగా మారింది.

Also Read: ఎంపీ Vs ఎమ్మెల్యే! మరోసారి వివాదం షురూ..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహ్మమరి పంజా విసురుతోంది. కరోనా మరణాలు పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కంటికి కన్పించకుండా కరోనా దాడిచేస్తుండటంతో ప్రజలు వీలైనంత వరకు ఇంటికే పరిమితం అవుతున్నారు. ప్రభుత్వాలు కూడా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. భౌతిక దూరం పాటించడం.. మాస్కులు ధరించడం.. శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చెబుతున్నా ప్రజల్లో మాత్రం కరోనాపై అపోహలు మాత్రం వీడడం లేదని తెలుస్తోంది.

కరోనా బారిన పడిన వారికి ప్రభుత్వం కోవిడ్ ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తోంది. సల్ప లక్షణాలు ఉన్నవారికి మాత్రం హోం ఐసోలేషన్లో ఉంచి చికిత్స చేస్తున్నారు. వీరంతా కూడా కొద్దిరోజులు వైరస్ తో పోరాడి కోలుకుంటున్నారు. అయితే ఇలాంటి వారి పట్ల కూడా ప్రజలు వివక్ష చూపుతుండటం గమనార్హం. కరోనాను జయించి ఇంటికొచ్చిన వారిపట్ల చుట్టుపక్కల వాళ్లు.. సన్నిహితులు, బంధువులు తమతో ఇంతక ముందుగా వ్యవహరించడం లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. తమను శత్రువులా చూస్తుండటం ఎంతో బాధకు గురిచేస్తుందని పలువురు కరోనా పేషంట్లు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Also Read: మంత్రిగారి ‘కరోనా’ దోపిడీ.. పిండేస్తున్నాడట!

నిన్నటి వరకు కలిసి తిరిగిన వారంతా తమను చూస్తేనే భయపడిపోతుండటం ఆవేదన కలిగిస్తుందంటున్నారు. మరికొందరు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. కరోనా భయం కంటే ఇతరుల చూపించే వివక్షే తమను మానసిక ఆందోళన కలిగిస్తుందని చెబుతున్నారు. ప్రజలకు ఈ వ్యాధిపట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లే కరోనాను జయించినా వారిపట్ల కూడా పలువురు వివక్ష చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాలు ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో విఫలమయ్యాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

వైద్యులు ఎంతో శ్రమించి కరోనా సోకిన వారిని బ్రతికిస్తుంటే.. చుట్టురా ఉండేవాళ్లు వారిపట్ల వివక్ష చూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు జరుగకుండా తొలినాళ్లలోనే వీటికి చెక్ పెట్టేలా చర్యలు చేపట్టాలని వైద్యులు కోరుతున్నారు. లేకపోతే రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత జఠిలంగా మారుతుందని అంటున్నారు.. దీనివల్ల మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కరోనా వ్యాధిపై ప్రజలకు ఉన్న భయాందోళనలు దూరం చేసేలా మరింత అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper