spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP New Districts: జిల్లాల ఉద్యమంతో వైసీపీ నేతల ఆధిపత్యం

AP New Districts: జిల్లాల ఉద్యమంతో వైసీపీ నేతల ఆధిపత్యం

AP New Districts: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిట్టుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్ర‌తిప‌క్షాల‌ను ఇరుకున పెట్టాల‌ని భావించిన ప్ర‌భుత్వం తానే గోతిలో ప‌డింది. అన్ని జిల్లాల్లో సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లే రోడ్డు ఎక్కుతున్నారు. వైసీపీ నిర్వాకంతో గొడ‌వ‌కు దిగుతున్నారు. త‌మ అభిప్రాయాల‌ను గౌర‌వించ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో నూత‌న జిల్లాల ఏర్పాటు వ్య‌వ‌హారం కాస్త లొల్లిగా మారుతోంది. అన్ని చోట్ల వైసీపీ నేత‌లు పార్టీపై అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతున్నారు. ప‌క్ష‌పాత ధోర‌ణితోనే ప్ర‌భుత్వం ఇలా చేస్తుంద‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో సీఎం జ‌గ‌న్ కు నిద్ర ప‌ట్ట‌డం లేదు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఏం చేయాల‌నే దానిపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారు. నేత‌ల‌ను ఎలా స‌ముదాయించాలో అర్థం కావ‌డం లేదు.

AP New Districts
AP New Districts

సీఎం సొంత జిల్లా క‌డ‌ప‌లో రాజంపేట‌ను జిల్లా కేంద్రంగా చేయాల‌నే డిమాండ్ ఉన్నా రాయ‌చోటిని చేశారు. దీంతో వైసీపీ నేత‌ల్లో కోపం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో వారు గొడ‌వ‌లు చేస్తున్నారు దీంతో వైసీపీ ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తోంది. ఏం చేసినా విమ‌ర్శ‌లు మాత్రం ఆగ‌డం లేదు. దీంతో వైసీపీ నేత‌ల్లో స‌హ‌నం న‌శించిపోతోంది. వైసీపీ నేత‌ల ఏకప‌క్ష నిర్ణ‌యాల‌తో ప్ర‌జ‌లు మౌనంగానే ఉన్నా వైసీపీ నేత‌లే లొల్లి రాజేస్తున్నారు. ఈ క్ర‌మంలో గొడ‌వ‌లు స‌ద్దుమ‌ణిగేలా ఏం చేయాల‌నే దానిపై ఫోక‌స్ పెడుతున్నారు. పార్టీ రువు పోకుండా కాపాడుకోవాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు.

మొద‌ట్లో టీడీపీ నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తాయని భావించినా వారు కామ్ గానే ఉన్నారు. కానీ సొంత పార్టీ నేత‌లు కుంప‌టి రాజేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్ చేసుకోవాల‌ని చూసినా తానే టార్గెట్ అయిపోతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో నిర‌స‌న‌లే పెరుగుతున్నాయి. సీఎంపై గుస్సా వ్య‌క్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏ ప్రాతిప‌దికన నిర్ణ‌యాలు తీసుకున్నారనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సీఎం నిర్ణ‌యాల‌ను అంద‌రు త‌ప్పుబడుతున్నారు. ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేసే విధానాలు అవ‌స‌రం లేద‌ని తెగేసి చెబుతున్నారు.

Also Read: త‌గ్గేదే లే అంటూనే తగ్గిన ఉద్యోగులు.. ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల‌కు జై..

పార్టీ నేత‌ల్లో ఉన్న ఆధిప‌త్య పోరుతోనే రోడ్డు మీద‌కు వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌జ‌లు మాత్రం ఎక్కువ‌గా స్పందించ‌డం లేదు. దీంతో ప్ర‌తిప‌క్షం సైతం నిశితంగా ప‌రిశీలిస్తోంది. వైసీపీ నేత‌ల తీరుపై ఏం మాట్లాడ‌కుండా ఉంటోంది. కానీ సొంత పార్టీలోనే నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. దీంతో వైసీపీ ఇబ్బందుల్లో ప‌డిపోతోంది. మింగ‌లేక క‌క్క‌లేక అన్న సామెత మాదిరి ఏం చేయాలో అర్థం కాని ప‌రిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. దీన్ని ప్ర‌తిప‌క్షం కూడా క్యాష్ చేసుకోవాల‌ని భావిస్తోంది.

దీంతో ఏపీలో కొన‌సాగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీకి ఏం చేయాలో పాలుపోవ‌డం లేదు. అధికార పార్టీ విధానాల‌తో పీక‌ల్లోతు క‌ష్టాల్లో మునిగిన‌ట్లు అయింది. టీడీపీ ఏదో షాకిద్దామ‌ని అనుకున్నా చివ‌ర‌కు త‌న‌కే షాక్ త‌గ‌ల‌డంతో డైల‌మాలో ప‌డుతోంది. సొంత పార్టీ నేత‌ల‌ను కంట్రోల్ చేయ‌లేక స‌త‌మ‌త‌మ‌వుతోంది. భ‌విష్య‌త్ లో ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయో అనే ఆందోళ‌న అంద‌రిలో నెల‌కొంది.

Also Read: టీచర్లు, ప్రభుత్వం మధ్య ఫైట్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Balakrishna: బాలయ్య ఈ ఇద్దరు లేకుండా సినిమా చేయడం లేదుగా…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. రీసెంట్ గా ఆయన చేసిన 'అఖండ 2' సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన...

YSR Congress: గోదావరి జిల్లాలో వైసీపీకి షాక్!

YSR Congress: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత ఒకరు గుడ్ బై చెప్పారు. పదేళ్లుగా పార్టీని బలోపేతం చేస్తున్న అతనిని కాదని వేరే వ్యక్తికి ప్రాధాన్యం...

YS Jagan: జగన్ కు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్!

YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పుంజుకునేందుకు ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. మరోవైపు పార్టీ నేతలకు కేసులు...

Tanuja: ‘అతని వల్లే ఈరోజు కళ్యాణ్ పడాల సేఫ్ గా ఉన్నాడు’ అంటూ ‘బిగ్ బాస్ 9’ ఫేమ్...

Tanuja: గత ఏడాది ప్రసారమైన 'బిగ్ బాస్ 9' షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినటువంటి సీజన్స్ అన్నిటికంటే ఈ సీజన్ కే...

Andhra Pradesh Gold Mines: ఏపీకి బంగారం లాంటి వార్త!

Andhra Pradesh Gold Mines: జాతీయస్థాయిలో ఏపీ భరోసారీ ప్రత్యేక గుర్తింపు పొందింది.'గోల్డెన్' ఛాన్స్ దక్కించుకుంది.. రాయలసీమలో మరో జిల్లాలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్య వహిస్తున్న చిత్తూరులో...
Oktelugu Epaper
Exit mobile version