అంతర్జాతీయంమోదీకి ఒబామా, ట్రంప్ ఇచ్చిన ప్రాధాన్యం జోబైడెన్ ఇచ్చాడా?

మోదీకి ఒబామా, ట్రంప్ ఇచ్చిన ప్రాధాన్యం జోబైడెన్ ఇచ్చాడా?

భారత ప్రధాని నరేంద్రమోడీకి జిగ్రీ దోస్త్ డోనాల్డ్ ట్రంప్. ఆయన మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా గెలవాలని ఏకంగా మోడీ అమెరికా వెళ్లి మరీ ‘హౌడీ మోడీ’ సభలో ప్రచారం చేశాడు. కానీ బ్యాడ్ లక్.. ట్రంప్ ఓడిపోయాడు. ఆయన ప్రత్యర్థి జోబిడెన్ గెలిచాడు. అమెరికా అధ్యక్షుడయ్యాడు. తన పగవాడికి ప్రాధాన్యమిచ్చి గెలుపునకు ప్రచారం చేసిన నరేంద్రమోడీ అమెరికాకు వచ్చాడు. ఈ క్రమంలోనే ప్రస్తుత అధ్యక్షుడు జోబిడెన్.. మోడీని సరిగ్గా మర్యాద ఇచ్చాడా? పట్టించుకున్నాడా? ప్రాధాన్యత కల్పించాడా? అన్నది చర్చనీయాంశమైంది.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది. అమెరికాకు మోదీ వెళ్లడం కొత్తేమీ కాదు. కానీ సుధీర్ఘ కాలం తరువాత మోదీ చేసిన మొదటి పర్యటన అమెరికాకు వెళ్లడమే. కరోనా మహమ్మారి కారణంగా పలు దేశాలతో సమావేశాలను ఆన్లైన్లోనే నిర్వహించారు. ప్రస్తుతం క్వాడ్ సదస్సులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. భారత్, అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు జపాన్ దేశాలు సభ్యత్వం కలిగిన క్వాడ్లో కీలక సమావేశాలు జరిగాయి. 2019లో మోదీ అమెరికా వెళ్లారు. అప్పుడు ట్రంప్ సర్కార్ ఉంది. అయితే మోదీ అప్పటి పర్యటనకు, ఇప్పటి పర్యటనకు చాలా తేడా ఉందంటున్నారు. నాడు ‘హోడీ మోడీ’ అంటూ అమెరికాలో ట్రంప్ కు మద్దతుగా మోడీ చేసిన ఎన్నికల ప్రచారం వైరల్ అయ్యింది. ట్రంప్ సర్కార్ మోడీని నెత్తిన పెట్టుకుంది. కానీ తాజాగా చేసిన పర్యటనట్లో మోదీకి గౌరవాలు దక్కలేదా..? అనే చర్చ సాగుతోంది.

కరోనా పరిస్థితులు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ఏర్పాటు చేసిన క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ అమెరికా వెళ్లారు. నాలుగు దేశాలు కలిసి వివిధ రంగాల్లో గ్రూపులను, కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. సభ్య దేశాల సహకారంతో సమస్యలు అధిగమించాలని చర్చించాయి. పలు విషయాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు తొలిసారిగా ముఖాముఖిగా సమావేశం అయ్యారు.

2019లో మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు ట్రంప్ పాలన సాగుతుండేది. అంతేకాకుండా ప్రవాస భారతీయులు సైతం పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేసి ‘హౌడీ మోదీ’ అని ఆ పర్యటనకు పేరు పెట్టారు. స్వయంగా ట్రంప్.. మోదీని సభకు తీసుకెళ్లారు. దీంతో మోదీ, ట్రంప్ ల మధ్య సాన్నిహిత్యం గురించి అందరూ చర్చించుకున్నారు. ఇక మోదీ ఆ సభలో మాట్లాడుతూ ‘ఔర్ ఏక్ బార్.. ట్రంప్ సర్కార్ ఆయేగా’ అంటూ ప్రసంగం చేశారు. దీంతో ట్రంప్ వర్గాలతో పాటు కొంతమంది ప్రవాసుల్లో సైతం మోదీ ప్రసంగం ఉత్తేజాన్ని నింపింది.

క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు ఈనెల 23న అమెరికా వెళ్లిన మోదీకి అమెరికా ప్రభుత్వం ఘనంగా స్వాగతించింది. అయితే మోదీ రాకను వ్యతిరేకించిన వాళ్లూ ఉన్నారు. కొందరు మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల వ్యూహంతో వారి పని సాధ్యం కాలేదు. ట్రంప్ హయాంలో మోదీ పర్యటించినప్పుడు అధ్యక్షుడే వైట్ హౌజ్ వెలుపలికి వచ్చి మోదీని స్వాగతించారు. కానీ ఈసారి బైడెన్ అలా చేయలేదు. కానీ వైట్ హౌజ్ అధికారులు దగ్గరుండి మోదీనీ తీసుకెళ్లారు. అంతకుముందులా అమెరికా అధ్యక్షుడితో మోదీ ఆలింగనం చేసుకోలేదు. అయితే దీనికి కరోనా కారణం అని చెబుతున్నారు.

ఇక మోదీ ప్రసంగంపై పత్రికలు పట్టించుకోలేదని తెలుస్తోంది. 2019లో మోదీ, ట్రంప్ ల గురించి ప్రత్యక కథనాలు రాశాయి. ఒక పత్రిక ‘భారత్ ట్రంప్ ’ అని కూడా పేర్కొన్నారు. అయితే ఈసారి మాత్రం అలా జరగలేదు. న్యూయార్క్ పత్రికల్లో మోదీ, బైడెన్ ల గురించి పెద్దగా వార్తలు రాయలేదు. ఇక కరోనా కారణంగా ఎలాంటి బహిరంగ సభలను ఏర్పాటు చేయలేదు. కేవలం వందల మంది భారతీయులను మాత్రమే మోదీ కలిశారు. మోదీకి స్వాగతం పలకడానికి ప్ల కార్డులు పట్టుకొని చాలా మంది వైట్ హౌజ్ వద్దకు వచ్చారు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత్, అమెరికా వ్యూహాలు ఒకేలా ఉన్నాయి. ఇరు దేశాల మద్య పరస్పర సహకారం కూడా అవసరం. అయితే ఈ సమావేశాల్లో కరోనా ప్రభావం బాగానే కనిపించింది. జాగ్రత్తలు తీసుకుంటూ సమావేశాలు నిర్వహించారు. మోదీని బైడెన్ పెద్దగా పొగడకపోయినా.. బైడెన్ ను మోదీ మహానాయకుడు అని అన్నారు. అటు యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ తో జరిగిన చర్చల్లో ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. మొత్తంగా మోదీకి ఈసారి అమెరికాలో మునుపటి అంతగా ప్రాధాన్యం దక్కలేదని తెలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Nara Lokesh: ఎన్డీఏ కు టిడిపి గుడ్ బై.. ప్రధానికి లోకేష్ చెప్పింది అదే!

Nara Lokesh: తెలుగుదేశం ఎన్డీఏ కు దూరం కావాలని భావించిందా? కేంద్రంలో అనిశ్చితి తేవాలని చూసిందా? ఇందుకు ముంబైలో ప్రయత్నాలు జరిగాయా? ఓ మాజీ ఉపరాష్ట్రపతి తో పాటు ఒక పారిశ్రామికవేత్తను చంద్రబాబుతో...

Prashant Kishor Comments On Modi: మోదీ సభకు వస్తే మార్కులేస్తారా.. నువ్వెక్కడ దొరికావయ్యా పీకే!

Prashant Kishor Comments On Modi: ప్రశాంత్‌ కిశోర్‌.. పరిచయం అక్కరలేని పేరు.. మంచి న్యాయవాది.. యాక్టివిస్ట్‌.. స్ట్రాటజిస్టు.. ఐదేళ్ల క్రితం వరకు పార్టీలకు స్ట్రాటజిస్టుగా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్, వైసీపీని...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Indus Water Dispute: సింధూ జలాలు కావలట… పాపం ఇజ్జత్ పోగొట్టుకున్న పాకిస్తాన్

Indus Water Dispute: ఎన్ని రకాలుగా అంతర్జాతీయ వేదికల మీద పరువు పోగొట్టుకున్నప్పటికీ పాకిస్తాన్ తీరు మారదు. సిగ్గు లేదా జీడి గింజ అంటే.. నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహారం...

Maho Beach: విమానం టేకాఫ్.. భయంకరమైన గాలులు.. పర్యాటకులు ఎగిరిపడ్డారు.. వైరల్ వీడియో

Maho Beach: వాతావరణం ఆహ్లాదంగా ఉంది.. మబ్బులు కమ్ముకున్నాయి. సముద్రపు అలలు తీరాన్ని తాకుతున్నాయి. పర్యాటకులు ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. సముద్రపు ఒడ్డున సేద తీరుతున్నారు. నచ్చిన ఫుడ్ తింటు ఎంజాయ్ చేస్తున్నారు....

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...
Exit mobile version