Homeఆంధ్రప్రదేశ్‌జనసేన బలం అక్కడ అంత పెరిగిందా?

జనసేన బలం అక్కడ అంత పెరిగిందా?

Janasenaఆంధ్రప్రదేశ్ లో జనసేన బలపడాలని చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ర్టంలో పట్టు కోసం పరితపిస్తోంది. ఏ పార్టీ అయినా తూర్పు గోదావరి జిల్లాను లక్ష్యంగా చేసుకుని ఎదిగేందుకు పాటుపడుతుందని తెలుసుకుని అక్కడి నుంచే తన ఇమేజ్ పెంచుకోవాలని చూస్తోంది. దీంతో జనసేనకు పార్టీ అధ్యక్షుడిని సైతం నియమించి దూకుడు ప్రదర్శిస్తోంది. ఎన్టీఆర్ నుంచి వైఎస్ జగన్ వరకు అందరూ తూర్పు గోదావరి నుంచే రాజకీయాలు ఆరంభించి విజయం సాధించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే ఎక్కువ కాపు సామాజికవర్గమే ఉండడంతో జనసేన విస్తరణపై ఆశలు పెట్టుకుంది.

తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా దుర్గేష్ ను పవన్ కల్యాణ్ నియమించారు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. గతంలో ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన దుర్గేష్ కు పగ్గాలు అప్పగించి జనసేన పార్టీని రాష్ర్టంలో ఎదగాలని చూస్తోంది. పార్టీ కోసం పనిచేసే క్యాడర్ ను నియమించుకోవాల్సి ఉంది. దుర్గేష్ 2019లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేశారు. ఓటమి చెందినా జగన్ వేవ్ లో 42 వేల ఓట్లు సాధించి తన పట్టు నిరూపించుకున్నారు. దీంతో ఆయనకు పగ్గాలు అప్పగించడం కరెక్టని పవన్ భావించారు. ప్రజారాజ్యం సమయం నుంచి కూడా నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు.

జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో జత కడుతుందో తెలియడం లేదు. ప్రస్తుతం బీజేపీతో పొత్తు ఉన్నా ఎక్కడ కూడా రెండు పార్టీలు కలిసి కార్యక్రమాలు చేయడం లేదు. దీంతో పొత్తు విషయంలో జనసేన ఎటు వైపు ఉందో తెలియడం లేదు. ఇప్పటికే టీడీపీ సైతం జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోందని తెలుస్తోంది. బీజేపీకి టీడీపీకి పడని సందర్భంలో జనసేన వైఖరి ఏంటో అర్థం కావడం లేదు. ఈ సమయంలో అధినేత పవన్ కల్యాణ్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి..

మరో వైపు ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడ కూడా ఆందోళనలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. రాబోయే ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా నుంచి తన ప్రస్థానం ప్రారంభించానలి జనసేన భావిస్తోంది. టీడీపీతో పొత్తు ఉంటే కనుక కందూరి దుర్గేష్ ఆధ్వర్యంలో జన సేన సంచనల విజయాలు సొంతం చేసుకుంటుందని అందరు భావిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper