India's captain Virat Kohli (C) embraces Pakistan's Imad Wasim (L) after victory in the 2019 Cricket World Cup group stage match between India and Pakistan at Old Trafford in Manchester, northwest England, on June 16, 2019. (Photo by Dibyangshu SARKAR / AFP) / RESTRICTED TO EDITORIAL USE
India’
ప్రపంచ క్రికెట్ లో శత్రుదేశాలైన భారత్, పాకిస్తాన్ ఎప్పుడు తలపడినా అది హైఓల్టేజ్ మ్యాచ్ గా కనిపిస్తుంది. ఈ రెండు జట్లు హోరాహోరీగా యుద్ధం చేస్తున్నట్టే తలపడుతాయి. ఈ మ్యాచ్ ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా వేయికళ్లతో చూస్తారు. క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తారు.
ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య వైరం, యుద్ధం, ఉగ్రవాదం కారణంగా ప్రత్యక్ష మ్యాచులు లేకుండా పోయాయి. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడుతాయా? అన్న ఆసక్తికి తెరదించుతూ తాజాగా భారత్ , పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ తేదిని ఖరారు చేశారు.
అక్టోబర్ 24న ఈ రెండు జట్లు తలపడనున్నట్టు సమాచారం. అన్ని మ్యాచ్ లషెడ్యూల్ లను ఈనెల రెండో వారంలో ప్రకటించనున్నారు. టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఒమన్, యూఏఈలో జరుగనుంది. దీంతో అక్టోబర్ 24న భారత్ , పాకిస్తాన్ మ్యాచ్ ను సెట్ చేసినట్టు సమాచారం.
గత రెండేళ్లుగా ప్రపంచ పోటీల్లో మాత్రమే ఇండియా, పాకిస్తాన్ తలపడుతున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్ లో చివరి సారిగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ గెలిచింది. మళ్లీ రెండేళ్ల తర్వాత ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.