spot_img
Homeజాతీయ వార్తలుDelhi Bomb Blast: ఢిల్లీ బాంబు పేలుడు.. వెలుగులోకి సంచలన నిజం

Delhi Bomb Blast: ఢిల్లీ బాంబు పేలుడు.. వెలుగులోకి సంచలన నిజం

Delhi Bomb Blast: రకరకాల విశ్లేషణలు… రకరకాల వార్తలు.. ఢిల్లీ బాబు పేలుళ్ల మీద వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితుల ఆధారంగా మీడియాలో వినిపిస్తున్నాయి.. పైగా ఢిల్లీ ఘటన జరిగిన తర్వాత.. ఘటన కంటే ముందు మన దేశ పోలీసులు.. ఇంటెలిజెన్స్ వర్గాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.. సోదాలు జరుపుతున్నాయి.. వచ్చిన సమాచారం ఆధారంగా అత్యంత లోతుగా పరిశీలన చేస్తున్నాయి.. అలా వచ్చిన వివరాల ఆధారంగానే మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

ఢిల్లీ బాంబు పేలుడు సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ.. ఒక స్టోరీ మాత్రం భయాందోళనకు గురిచేస్తోంది. ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ కు ఆత్మాహుతి దళం కారణం కాదని.. అది భయాందోళన వల్ల తొందరపాటు చేసిన దాడి అని తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. “టెర్రర్ నెట్వర్క్ పై దాడుల నేపథ్యంలో.. కలిగిన ఒత్తిడి వల్ల ఇలా చేసి ఉండవచ్చు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి పూర్తిస్థాయి ఆత్మాహుతి పేలుడు విధానాన్ని అనుసరించలేదు. కావాలని అతడు దేనిని ఢీకొట్టలేదు. పూర్తిగా అభివృద్ధి చెందని బాంబును ఉపయోగించాడు. అందువల్లే ఈ దాడిలో తీవ్రత తగ్గింది.. లేకుంటే దాని పర్యవసానం వేరే విధంగా ఉండేదని” జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఉన్న మెట్రో రైల్వే స్టేషన్ పక్కన కారులో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదిమంది దాకా మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు.. చాలావరకు వాహనాలు ధ్వంసమయ్యాయి. మంటలు కూడా విపరీతంగా వ్యాపించాయి. ఆ మంటల వల్ల చుట్టుపక్కల ఉన్న జనాలు భయాందోళనకు గురయ్యారు.

ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను ఆర్పి వేశాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. అనుమానస్పద వ్యక్తులను ప్రశ్నించి వదిలేశారు. ఆ తర్వాత సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఉన్న వివరాల ఆధారంగా ఈ కేసు కు సంబంధించి ఒక అంచనాకు వచ్చారు. హ్యుందాయ్ కారులో పెట్టిన బాంబు వల్ల ఈ ప్రమాదం జరిగిందని.. ఆ కారు ఎవరిదో కూడా పోలీసులు గుర్తించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. మరవైపు ఫరీదాబాద్ ప్రాంతంలో ఓ యూనివర్సిటీలో కొంతమంది వైద్యులు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు వెంటనే ఆ వైద్యులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో భారీ టెర్రరిస్ట్ మాడ్యూల్ బయటపడింది. ఇంకా లోతుగా దర్యాప్తు చూస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version