Homeజాతీయ వార్తలుDana Cyclone: సంద్రం నుంచి తీరం వైపు తుఫాన్.. ఏపీ ఉత్తరాంధ్ర వణికిపోతోంది..

Dana Cyclone: సంద్రం నుంచి తీరం వైపు తుఫాన్.. ఏపీ ఉత్తరాంధ్ర వణికిపోతోంది..

Dana Cyclone: రాష్ట్రానికి దానా తుఫాను ముప్పు తప్పింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్యంగా పైనుంచి తుఫానుగా బలపడిన సంగతి తెలిసిందే. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ తీరం వైపు దూసుకెళ్లింది ఒడిస్సా లో తీరం దాటింది. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత తుఫాను తీరం వైపు దూసుకెళ్లింది. ఒడిస్సా లోని బిత్తర్ కనిక జాతీయ పార్క్, ధమ్రా మధ్యతుఫాను తీరం దాటింది.శుక్రవారం ఉదయం వరకుఇది కొనసాగి బలహీన పడనుంది. ప్రస్తుతం ఒడిస్సా తీరం వెంబడి భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా భద్రక్, కేంద్రపార జిల్లాల్లో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో తీవ్ర గాలులు వీస్తున్నాయి. పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. తుఫాన్ ప్రభావంతో ఒడిస్సా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించాలని రెండు రాష్ట్రాల అధికారులకు కేంద్రం ఆదేశించింది. మరోవైపు కోల్ కత, భువనేశ్వర్ ఎయిర్ పోర్టును శుక్రవారం సాయంత్రం వరకు మూసి వేయనున్నారు. రెండు రాష్ట్రాల్లో మొత్తం 400 రైళ్లను రద్దు చేశారు.అయితే ఈ తుఫాను ప్రభావం ఏపీ పైపెద్దగా చూపలేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పై ప్రభావం చూపుతుందని ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. గత అనుభవాల దృష్ట్యా ముందే మేల్కొంది. ప్రమాదం తప్పడంతో అటు యంత్రాంగం తో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

* అక్టోబర్ లో భయం భయం
సాధారణంగా అక్టోబర్ వచ్చిందంటే చాలు ఉత్తరాంధ్ర ప్రజలు చిగురుటాకులా వణికి పోతారు. ఈ నేపథ్యంలోనే దానా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి.. తీరం దాటి క్రమంలో విధ్వంసం సృష్టిస్తుందని భావించారు. గత అనుభవాల దృష్ట్యా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ తరుణంలోనే ఏపీ ప్రభుత్వాన్ని సైతం అలెర్ట్ చేసింది. కానీ తుఫాను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

* ఆగస్టులో అపార నష్టం
ఆగస్టు నెలలో సంభవించిన తుఫాను ప్రభావంతో ఏపీ నష్టపోయింది. ముఖ్యంగా విజయవాడ నగరం మునిగిపోయింది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. పెద్ద ఎత్తున పరిహారం సైతం అందించాయి. అయితే మరోసారి ఏపీకి ముప్పు ఉందని తెలియడంతో ప్రజలు భయపడ్డారు. అయితే అదే సమయంలో ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపడంలో ప్రభుత్వం విజయవంతం అయింది. మొత్తానికైతేతుఫాను ముప్పు తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version