పవన్ పై విమర్శలా.. వైసీపీని ఉతికారేసిన విష్ణు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో తిరుగుతున్నారని వైసీపీ మంత్రులు, నేతల విమర్శలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తిరుపతి లో మీడియా సమావేశంలో నిర్వహించిన విష్ణు వైసీపీ నేతల మాటలకు కౌంటర్లు ఇచ్చారు. బీజేపీ- జనసేన కవాతు చూసి వైకాపా మంత్రులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. వైసీపీ మంత్రులు పిరికిపందల్లా కనపడుతున్నారని మండిపడ్డారు. కొడాలి నాని, పేర్ని నాని మంత్రులుగా అసలు పనికిరారని.. మంత్రులు సీఎం జగన్ […]

Written By: NARESH, Updated On : April 4, 2021 8:45 pm
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో తిరుగుతున్నారని వైసీపీ మంత్రులు, నేతల విమర్శలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తిరుపతి లో మీడియా సమావేశంలో నిర్వహించిన విష్ణు వైసీపీ నేతల మాటలకు కౌంటర్లు ఇచ్చారు. బీజేపీ- జనసేన కవాతు చూసి వైకాపా మంత్రులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. వైసీపీ మంత్రులు పిరికిపందల్లా కనపడుతున్నారని మండిపడ్డారు. కొడాలి నాని, పేర్ని నాని మంత్రులుగా అసలు పనికిరారని.. మంత్రులు సీఎం జగన్ ఇంటి పని మనుషుల్లా చేస్తున్నారని విష్ణు ఫైర్ అయ్యారు.

పవన్ కల్యాణ్, సునీల్ దేవ్ ధర్ లను ఏక వచనంతో విమర్శిస్తున్నారని.. పవన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే దమ్ముందా? అని విష్ణు ప్రశ్నించారు. పవన్ ప్రత్యేక విమానం లో తిరుగుతున్నారు అని విమర్శిస్తున్నారని.. సీఎం జగన్ సైకిల్ మీద తిరుగుతున్నారా? అని కౌంటర్ ఇచ్చారు. ప్రజల సొమ్ము తో సీఎం ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని.. పవన్ సొంత ఖర్చుతో పయనిస్తున్నారని విష్ణు చెప్పుకొచ్చారు.

ప్రధాని మోదీ, అమిత్ షా లకు ఎర్రచందనం స్మగ్లింగ్ తో సంబంధం ఉందని మాట్లాడారని.. విమర్శించే వాళ్ళు కళ్ళు కనపడని, చెవులు వినపడని ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని విష్ణు మండిపడ్డారు.

తిరుపతి భాజపా లో ఎదుర్కోవటానికి 10మంది మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు మకాం వేశారని.. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని.. ఓటుకి 2వేల రూపాయలు పంచాలని నిర్ణయం సిగ్గుచేటు అని విష్ణు ఫైర్ అయ్యారు. మీ బినామీని తీసుకొచ్చి గ్లాస్ గుర్తు తెప్పించుకున్నారని మండిపడ్డారు.

రామతీర్థం, అంతిర్వేది ఘటనల్లో హోంమంత్రి అసమర్ధత ను మీరే చెప్పుకుంటున్నారా అని విష్ణు నిలదీశారు. బీజేపీ ఆందోళన చేశాకే దేవాలయాల్లో సీసీ కెమెరాలు వచ్చాయని విష్ణు తెలిపారు. బీజేపీ నేతలు విగ్రహాలు కూల్చితే కేసులు పెట్టండని.. లేదంటే హోం మంత్రిని రాజీనామా చేయమనండని విష్ణు సవాల్ చేశారు. నిజంగా వైసీపీ నేతలకు దమ్ముంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేయండని కౌంటర్ ఇచ్చారు.