Homeఅంతర్జాతీయంRussia Ukraine War: రష్యాపై కార్పొరేట్ యుద్ధం.. 50 దేశాలతో పుతిన్ కటీఫ్

Russia Ukraine War: రష్యాపై కార్పొరేట్ యుద్ధం.. 50 దేశాలతో పుతిన్ కటీఫ్

Russia Ukraine War: మేధావులు మూర్ఖులంటారు. ఇది నిజమే అనిపిస్తుంది. కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా మూర్ఖుడేనా అనుకోవాల్సి వస్తుంది. ప్రపంచ దేశాలన్ని యుద్దం వద్దనివారిస్తున్నా పుతిన్ మాత్రం వినడం లేదు. వాటి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా వాటిని సైతం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఏకాకిగా మిగిలిపోతున్నా నిర్లక్ష్యమే ఆయన సమాధానం కావడం నిస్సందేహంగా మూర్ఖత్వమే. కానీ పుతిన్ మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లని వాదిస్తున్నారు.

Vladimir Putin
Vladimir Putin

ఈ నేపథ్యంలో తనను వ్యతిరేకిస్తున్న దేశాలతో పుతిన్ సంబంధాలు తెంచుకోనున్నట్లు తెలుస్తోంది. వాటిని అన్ ఫ్రెండ్లీ దేశాలుగా ప్రకటిస్తున్నారు. ఇకపై ఆ దేశాలు రష్యాతో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవాలంటే పుతిన్ నియమించిన కమిటీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పుతిన్ యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్ లను కలుపుకుని దాదాు 50 దేశాలతో సంబంధాలు తెంచుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..: అమెరికా ద్వంద్వ వైఖరి..?

అన్ ఫ్రెండ్లీ దేశాలకు చెందిన వారు రష్యాలో వ్యాపారం చేయాలనుకుంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రష్యా చర్యలను అంతర్జాతీయంగా ఖండిస్తున్నా పుతిన్ మాత్రం వినిపించు కోవడం లేదు. తన ఆదేశాలను తప్పు పట్టిన దేశాలకు ఇదే సరైన సమాధానం అని సూచిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ రోజురోజుకు రాక్షసుడిలా మారుతున్నారని అనుమానాలు వస్తున్నాయి.

అంతర్జాతీయంగా ఆయా దేశాలు విధిస్తున్న నిషేధాలను పట్టించుకోకుండా తానే ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇకపై తమ దేశంతో స్నేహ సంబంధాలు కొనసాగించే అవకాశమే లేదని చెబుతున్నారు. పుతిన్ చర్యలకు అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రష్యాను అన్ని దేశాలు వ్యతిరేకిస్తుంటే వాటిని పుతిన్ వెలివేస్తున్నారు. ఫలితంగా తనలోని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Vladimir Putin
Vladimir Putin

ఉక్రెయిన్ పై దాడితో అన్ని దేశాలతో శతృత్వాన్ని పెంచుకుంటున్నారు. అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ దేశాల ఆగ్రహాన్ని లెక్కచేయడం లేదు. అంతేకాదు తమ దేశంతో ఇకపై ఏ దేశం కూడా స్నేహపూర్వకంగా ఉండే అవకాశమే లేకుండా చేస్తున్నారు. దీనిపై భవిష్యత్ లో మరిన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: ఉక్రెయిన్ నుంచి తెచ్చిన విద్యార్థులనూ ప్రచారానికి వాడుకోవడం ఏంటీ మోడీసారూ?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version