మరోవైపు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.44.52 లక్షల విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్లు సంఘం నాయకులు అందించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్కు చెక్కు అందించిన తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ యార్లగడ్డ రాజాచౌదరి, కో కన్వీనర్ మాధవ్లు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అందజేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్కు చెక్కును అందించారు.