spot_img
Homeజాతీయ వార్తలుCockroach founder: కాక్రోచ్ ఫౌండర్ కు దిమ్మతిరిగింది.. ఇది అసలు ఊహించలేదుగా..

Cockroach founder: కాక్రోచ్ ఫౌండర్ కు దిమ్మతిరిగింది.. ఇది అసలు ఊహించలేదుగా..

Cockroach founder: దేశ రాజకీయాలను మారుస్తాం.. అవినీతి లేని పరిపాలన అందిస్తాం.. యువత నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు మెరుగైన పరిపాలన అందిస్తాం.. ఇలా సంచలన హామీలతో ఆన్లైన్లో ఏర్పాటు అయింది కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీ ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో చాలామంది ఫాలోవర్స్ ను పొందింది.. సంచలన ప్రకటనలతో ఇంకా ఇంకా సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడిగా అభిజిత్ కొనసాగుతున్నారు. ఈయన అమెరికాలో చదువుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిగా ఈయన సంచలన విషయాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నారు. దేశ రాజకీయాలను మారుస్తామని, ప్రజలు తమకు సహకరించాలని కోరుతున్నారు. ఎక్కడో అమెరికాలో ఉంటూ.. ఇటువంటి ప్రకటనలు చేస్తున్న అభిజిత్ మీద కొంతమంది విమర్శలు చేస్తుండగా.. మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అభిజిత్ ఇప్పుడు దేశ రాజకీయాలలో ఒక సంచలన వ్యక్తిగా మారిపోయారు. జనరేషన్ జెడ్ ఉద్యమాన్ని తీసుకురావాలని కోరుతున్న ఈయన.. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి పని చేశారు. ఇప్పుడు ఈయన బోస్టన్ లో చదువుకుంటున్నారు. అక్కడి నుంచే కాక్రోజ్ జనతా పార్టీ వ్యవహారాలను నడుపుతున్నారు.

సోషల్ మీడియాలో సంచలన సృష్టిస్తున్న అభిజిత్ కు ఇప్పుడు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది. ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. దాన్ని రికవరీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ మీద ఆయనకు యాక్సిస్ లేకుండా పోయింది. ఒకవేళ ఎవరైనా పోస్టులు చేస్తే.. వాటిని అధికారిక ప్రకటనలుగా భావించవద్దని అభిజిత్ వెల్లడించారు.

మనదేశంలో సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తులు పుట్టుకొస్తుంటారు. కొంతమంది సెలబ్రెటీలు అవుతుంటారు. వారిని చాలామంది ఫాలో అవుతుంటారు. అలా అయినంత మాత్రాన వారేమీ దేశ పరిపాలకులు కాలేరు. మహా అయితే సెలబ్రిటీల హోదా అనుభవిస్తారు. డబ్బు కూడా సంపాదిస్తారు. అంతవరకే వారి స్థాయి ఆగిపోతుంది. అంతకుమించి ఊహించుకుంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు అభిజిత్ విషయంలో కూడా అదే జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. సోషల్ మీడియాలో ఒక పార్టీ ఏర్పడినంత మాత్రాన అది దేశాన్ని పరిపాలిస్తుందని ఎలా అనుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అనవసరంగా హడావిడి తప్ప ఉపయోగం లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper