spot_img
Homeజాతీయ వార్తలుCoal Gasification India: బొగ్గు నుంచి గ్యాస్‌.. ఇంధన స్వాతంత్య్రవైపు భారత్‌ కీలక అడుగు!

Coal Gasification India: బొగ్గు నుంచి గ్యాస్‌.. ఇంధన స్వాతంత్య్రవైపు భారత్‌ కీలక అడుగు!

Coal Gasification India: భారతదేశం ఇంధన దిగుమతులపై ఎంతగా ఆధారపడి ఉందో ఇటీవలి ఘటనలు మరోసారి ఉద్ఘాటించాయి. ఎల్‌ఎన్‌జీలో 42 శాతం ఖతార్‌ నుంచి భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. అయితే తాజాగా పశ్చిమాసియా యుద్ధం కారణంగా అమెరికా, ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడిచేశాయి. ఇరాన్‌ గల్ఫ్‌ దేశమైన ఖతార్‌పై దాడిచేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడంతో భారత్‌కు ఎల్‌ఎన్‌జీ సరఫరా 30 శాతం పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 17 శాతం గ్యాస్‌ సరఫరా తగ్గడం కేవలం భారత్‌ సమస్య మాత్రమే కాదు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ స్థిరత్వానికి కూడా హెచ్చరిక.

కేంద్రం కీలక నిర్ణయం..
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఎన్‌జీ కొరత తీర్చడానికి కీలక నిర్ణయం తీసుకుంది. 37,500 కోట్ల రూపాయలతో కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టుకు చేపట్టిన నిర్ణయం సమయోచితం మాత్రమే కాదు, దూరదృష్టి కలిగిన వ్యూహాత్మక చర్య. బొగ్గు నుంచి గ్యాస్‌ ఉత్పత్తి చేసే ఈ సాంకేతికత ద్వారా దేశం దీర్ఘకాలికంగా విదేశీ ఆధారాలను తగ్గించుకోవడం సాధ్యమవుతుంది.

విదేశాలపై ఆధార పడకుండా..
ఖతార్, దుబాయ్‌ వంటి దేశాలపై ఎల్‌ఎన్‌జీ కోసం అత్యధికంగా ఆధారపడటం భారత్‌ శక్తి భద్రతకు పెద్ద ముప్పు. భౌగోళిక రాజకీయ సంక్షోభాలు ఎప్పుడు ఏ రూపంలో మన సరఫరా గొలుసును దెబ్బతీస్తాయో చెప్పలేం. గతంలో రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం కూడా ఇంధన ధరలను పెంచి భారత్‌ను ఇబ్బంది పెట్టింది. ఇలాంటి సందర్భాల్లో స్థానిక ఉత్పాదకతను పెంచకపోతే, ఆర్థిక వ్యవస్థ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు చేపట్టిన కోల్‌ గ్యాసిఫికేషన్‌ కార్యక్రమం భారత్‌ చరిత్రలో మొదటి సారి ఇంత పెద్ద స్థాయిలో చేపట్టిన ప్రయత్నం. దేశంలో సమృద్ధిగా ఉన్న బొగ్గు వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని, సింథటిక్‌ గ్యాస్‌ ఉత్పత్తి చేయడం ద్వారా దిగుమతులు తగ్గించి, విదేశీ మారక నిల్వలను కాపాడవచ్చు.

ఉత్పత్తిలో సవాళ్లు…
ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఖతార్‌పై మాత్రమే కాక, మొత్తం ఇంధన దిగుమతులపై ఆధారం తగ్గుతుంది. ఉపాధి అవకాశాలు పెరగడం, బొగ్గు ఉత్పత్తి ప్రాంతాల అభివృద్ధి, శక్తి భద్రత వంటి బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఇది ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా నిలవవచ్చు. ఖతార్‌ వంటి దేశాలపై ఆధారపడిన అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఇలాంటి మార్గాలు అన్వేషించేలా చేస్తుంది. అయితే, ఈ ప్రయత్నం సవాళ్లు లేకుండా కాదు. పర్యావరణ భద్రత, కార్బన్‌ ఉద్గారాల నియంత్రణ, ఆధునిక టెక్నాలజీ అవసరం ఉంది. కార్బన్‌ క్యాప్చర్‌ అండ్‌ స్టోరేజ్‌ (సీసీఎస్‌) వంటి సాంకేతికతలను తప్పనిసరిగా అనుసరించాలి. ప్రారంభ దశలో ఖర్చులు ఎక్కువైనా, దీర్ఘకాలిక లాభాలు భారీగా ఉంటాయి.

ఇంధన రంగంలో స్వాతంత్య్రం సాధించడం ఏ దేశానికైనా జాతీయ భద్రతకు సమానం. ఖతార్‌ సంక్షోభం భారత్‌కు ఒక కఠిన హెచ్చరికగా మారి, స్వయం సమృద్ధి వైపు వేగంగా అడుగులు వేయడానికి కారణమైంది. మోదీ సర్కారు చేపట్టిన కోల్‌ గ్యాసిఫికేషన్‌ కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేస్తే, ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాకుండా, భారత్‌ ఇంధన విధానంలోనే ఒక చారిత్రక మలుపుగా నిలుస్తుంది. ఈ దిశలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ రక్షణ, సమర్థవంతమైన అమలుతో ఈ ప్రయత్నం పూర్తి విజయం సాధించాలని ఆశిద్దాం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version