Homeజాతీయ వార్తలుజీహెచ్ఎంసీ ఎన్నికలపై యోగీ ఆసక్తికర ట్వీట్..!

జీహెచ్ఎంసీ ఎన్నికలపై యోగీ ఆసక్తికర ట్వీట్..!

Yogiగ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటడంతో బీజేపీ పెద్దలు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందించారు. గ్రేటర్లో అధికార పార్టీకి ధీటుగా సీట్లు సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు. జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

Also Read: గ్రేటర్ ఫలితాలపై టీఆర్ఎస్ పోస్టుమార్టం.. చివరకు తేలిందెంటీ?

తాజాగా జీహెచ్ఎంసీ ఫలితాలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్లో బీజేపీ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కు 55 సీట్లకు ధీటుగా బీజేపీ 48సీట్లు సాధించడం అభినందనీయమన్నారు. అలాగే ఎంఐఎం పార్టీని బీజేపీ మూడో స్థానానికి పరిమితం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ ను ఆయన భాగ్యనగరంగా సంబోధిస్తూ ట్వీట్ చేశారు. యోగీ ఆదిత్యనాథ్ గతంలో హైదరాబాద్ వచ్చిన సమయంలో హైదరాబాద్ ను భాగ్యనగరంగా మారుస్తారా? అని మీడియా ప్రశ్నించగా ఎందుకు మార్చకూడదని తిరిగి ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే ఫైజాబాద్‌ను అయోధ్య అని.. అలహాబాద్‌ను ప్రయాగ్రాజ్ అని మార్చినట్లు ఆయన గుర్తు చేశారు.

Also Read: ఆ ఒక్కడే చేయగలడు.. కేసీఆర్ పై ఓవైసీ హాట్ కామెంట్స్

ఈక్రమంలోనే హైదరాబాద్ ను సైతం భాగ్యనగరంగా మారుస్తామంటూ కామెంట్స్ చేశారు. బీజేపీపై గ్రేటర్ వాసులకు నమ్మకం ఏర్పడిందని తెలిపారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ లో బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. బీజేపీపై నమ్మకంతో ఓటేసిన భాగ్యనగరవాసులకు యోగీ ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫలితాలతో భాగ్యనగర నిర్మాణానికి పునాదులు పడ్డాయని తెలిపారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper
Exit mobile version