టీడీపీ నోరు మూయించే జగన్ ప్లాన్

రాజకీయాలంటేనే ఒకరి ఎత్తులకు మరొకరు పై ఎత్తులు వేయడం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు పూర్తిగా ఆలయాల చుట్టూరా తిరుగుతున్నాయి. దేవతా మూర్తులకు జరుగుతున్న అపచారాలను ఎత్తి చూపుతూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు ఆ ఆరోపణలతో జగన్ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఓ పక్క ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, మరో పక్క బీజేపీ – జనసేన ద్వయం హిందుత్వ అజెండా విషయంలో పోటీ పడి మరీ రాజకీయం సాగిస్తున్నాయి. Also Read: అఖిలప్రియ భవిష్యత్ ఏం […]

Written By: Srinivas, Updated On : January 9, 2021 10:42 am
Follow us on


రాజకీయాలంటేనే ఒకరి ఎత్తులకు మరొకరు పై ఎత్తులు వేయడం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు పూర్తిగా ఆలయాల చుట్టూరా తిరుగుతున్నాయి. దేవతా మూర్తులకు జరుగుతున్న అపచారాలను ఎత్తి చూపుతూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు ఆ ఆరోపణలతో జగన్ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఓ పక్క ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, మరో పక్క బీజేపీ – జనసేన ద్వయం హిందుత్వ అజెండా విషయంలో పోటీ పడి మరీ రాజకీయం సాగిస్తున్నాయి.

Also Read: అఖిలప్రియ భవిష్యత్ ఏం కానుంది?

అయితే.. క్రైస్తవ మతాన్ని నమ్మే ముఖ్యమంత్రిని ఈ పరిస్థితి ఇరకాటంలోకి నెడుతోంది. దాంతో దీనికి విరుగుడు ఆలోచించిన వైసీపీ ముందుగా టీడీపీ నోరు మూయించాలని నిర్ణయించింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో అనేక దేవాలయాలను నాటి సర్కార్ తొలగించింది. కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ నిర్మాణానికి అడ్డంగా ఉన్న వాటిని కూల్చేసింది. నాడు దీనిపై వివాదం చెలరేగితే ప్రత్యామ్నాయంగా స్థలాన్ని కేటాయించి నిర్మిస్తామని చెప్పి ఆ వాగ్దానం అటకెక్కించింది.

అదే ఇప్పుడు వైసీపీకి ఆయుధంగా మారింది. చంద్రబాబు హయాంలో పడగొట్టిన ఆలయాలను జగన్ చేతుల మీద పునర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిస్తే ప్రధాన పక్షం ముఖ్యమంత్రిపై చేస్తున్న మత దాడికి విరుగుడు లభించినట్లేనని వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ మేరకు విజయవాడలోని దాదాపు 9 ఆలయాలకు జగన్ శంకుస్థాపన చేశారు.

Also Read: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు, ప్రాక్టికల్స్ ఎప్పుడంటే..?

అంతేకాదు.. దుర్గగుడి అభివృద్ధికి రూ.70 కోట్లను కేటాయించారు జగన్‌. దేవుడు పేరుతో జరుగుతున్న రాజకీయాన్ని అదే దేవుడి సెంటిమెంట్‌తో తిప్పికొట్టాలన్నది అధికారపార్టీ ఆలోచన. ఇది టీడీపీకి వాత పెట్టేదే అయినా బీజేపీకి మాత్రం సమాధానం చెప్పినట్లు కాదు. మరి వారికి జగన్ ఏ స్కెచ్ వేస్తారు ? ఆలయాల పునర్ నిర్మాణ హడావిడితో టీడీపీ అనుసరించే కొత్త వ్యూహం ఎలా ఉంటుందనేది ఆసక్తికరమే. మొత్తంగా టీడీపీ కుయుక్తులను తిప్పికొట్టేందుకు జగన్‌ సర్కార్ దీటుగా ఆలోచన చేసినట్లు అర్థమవుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్