CM Jagan: ప్రజలకు జగన్ బ్యాంక్ లోన్లు.. త్వరపడండి

CM Jagan: పేదవాడికి సొంతింటి కల నెరవేరడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మధ్యతరగతి వారు తక్కువ ధరకే ఇళ్లు నిర్మించుకోవడానికి స్మార్ట్ టౌన్ షిప్ ప్రాజెక్టు ప్రారంభించనుంది. దీంతో పేదవారు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం సాయం చేయనుంది. దీని కోసం ప్రణాళిక రచించింది. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ప్రాజెక్టను ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా నవులూరును పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. తొలి దశలో ఆరు జిల్లాల్లో ప్రారంభించి తరువాత మిగతా జిల్లాలకు విస్తరించనుంది. దీంతో […]

Written By: Srinivas, Updated On : January 11, 2022 11:16 am
Follow us on

CM Jagan: పేదవాడికి సొంతింటి కల నెరవేరడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మధ్యతరగతి వారు తక్కువ ధరకే ఇళ్లు నిర్మించుకోవడానికి స్మార్ట్ టౌన్ షిప్ ప్రాజెక్టు ప్రారంభించనుంది. దీంతో పేదవారు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం సాయం చేయనుంది. దీని కోసం ప్రణాళిక రచించింది. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ప్రాజెక్టను ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా నవులూరును పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు.

CM Jagan

తొలి దశలో ఆరు జిల్లాల్లో ప్రారంభించి తరువాత మిగతా జిల్లాలకు విస్తరించనుంది. దీంతో ప్రభుత్వం పేదలందరికి ఇళ్లు నిర్మించుకునేలా ప్రణాళిక ప్రారంభించింది. ఆర్థికంగా ఆదుకుని రాష్ర్టంలోని దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందజేయాలని భావించింది. దీంతో పేదవారి ఆశలను నిజం చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు కూడా వెసులుబాటు కల్పించారు. నాలుగు వాయిదాల్లో రుణం తీర్చేందుకు వీలు కల్పించడంతో పేదవారు ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు వస్తే వారికి కూడా రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. దీంతో ఆశావహుల్లో ఆసక్తి పెరుగుతోంది.

Also Read: దమ్ముంటే అనర్హత వేటు..జగన్ కు రఘురామ సవాల్

ప్రజలకు తక్కువ ధరకే ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రచిస్తోంది. స్మార్ట్ టౌన్ షిప్ ప్రాజెక్టును ప్రారంభించనుంది. దీనికి గాను పలు జిల్లాల్లో కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని అక్కడ పేదవారికి ఇళ్ల స్థలాలు విక్రయించడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీంతో డబ్బు లేని వారికి బ్యాంకు రుణాలు కూడా అందుబాటు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరిగేలా చేసేందుకు నిర్ణయించారు. దీంతో ఇళ్లు లేని వారు ఉండకూడదనే సర్కారు ఉద్దేశంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.

దీంతో పేదవారి కోసం ఉద్దేశించిన పథకం కావడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కల నెవరని వారు ఎందరో ఉంటున్నారు. దీంతో ప్రభుత్వం వారి కోసం ఈ స్మార్ట్ టౌన్ షిప్ కార్యక్రమం రూపకల్పన చేసింది. ఇందుకు గాను వారికి ఆర్థిక సాయం చేసేందుకు కూడా రుణాలు ఇప్పించేందుకు సిద్ధమైంది. దీంతో భవిష్యత్తులో పేదవారికి సొంతిళ్లు లేదనే విధంగా పథకం రూపొందించినట్లు తెలుస్తోంది.

Also Read: అంతులేని అభిమానం.. సీఎం జగన్‌కు బంగారు పుష్పాలతో అభిషేకం.. ఎక్కడంటే!

Tags