Homeఅంతర్జాతీయంChina Rice Plants Zero-Gravity: చైనా చేసిన అద్భుతం.. అంతరిక్షంలో అన్నదానం సక్సెస్‌

China Rice Plants Zero-Gravity: చైనా చేసిన అద్భుతం.. అంతరిక్షంలో అన్నదానం సక్సెస్‌

China Rice Plants Zero-Gravity: భూమిపై వ్యవసాయం చేయడానికి ఆపసోపాలు పడుతున్న రోజులి. వాతావరణ ప్రతికూల పరిస్థితులతో ఇబ్బందులెదరవుతున్న తరుణంలో సాగు కష్టతరంగా మారుతోంది. ప్రపంచంలో రోజురోజుకూ వ్యవసాయం చేసేవారు తగ్గముఖం పడుతున్నారు. ఇటువంటి తరుణంలో ప్రపంచానికి చైనా గట్టి సందేశమే పంపింది. అంతరిక్షంలో వరితో పాటు ఇతర పంటలను విజయవంతంగా సాగుచేసింది. ఏకంగా అంతరిక్ష కేంద్రంలోనే పంటలను పండించారు. ఈ విషయాలు బయటకు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది చైనా. అగ్రదేశం చైనా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ స్పేస్ స్టేషన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు కొలిక్కి వస్తున్నాయి. ఇంతలో టైమ్ వేస్ట్ చేయడం ఎందుకో? అని అనుకుందేమో కానీ.. సైన్స్ ప్రయోగాలను చేయడం ప్రారంభించింది. అందులో భాగంగా జీరో గ్రావిటీ ల్యాబ్ లో ఏకంగా వరి మొక్కలను విజయంవంతంగా సాగుచేసింది. అవి పెరిగి ఉత్పత్తినిచ్చే స్థాయికి మొక్కలు పెరిగాయి. ఈ విషయాన్ని చైనీస్ అకడమీ ఆఫ్ సైన్స్ తన లైఫ్ సైన్స్ పరిశోధనల్లో వెల్లడించింది.

China Rice Plants Zero-Gravity
China Rice Plants Zero-Gravity

రెండు నెలల కిందట నుంచే..
జూలై లో ప్రయోగాన్ని ప్రారంభించిన చైనా రెండు నెలల వ్యవధిలోనే పూర్తిచేసింది. రెండు రకాలైన విత్తనాలపై ఆ ప్రయోగం చేసింది. క్యాబేజీతో పాటు వరి విత్తనాలపై ప్రయోగం చేసి స్పేస్ స్టేషన్ లోని వెబియన్ ల్యాబులో వాటి పెంచింది. చైనా వ్యోమోగాములు ప్రత్యేక శ్రద్ధ కనబరచి అంతరిక్షంలో కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి మరీ పంటలను విజయవంతంగా సాగుచేయడం ఆసక్తి గొల్పుతోంది. అయితే ప్రస్తుతానికి తక్కువ అంటే మొక్కలు స్థాయిలో క్యాబేజీ, వరి పంటలపై చేసిన ఈ ప్రయోగం భవిష్యత్లో ఇతర పంటల సాగు అధ్యయనానికి మాత్రం ఎంతగానో ఉపకరిస్తుందని చైనా వ్యోమోగాములు చెబుతున్నారు. రేడియేషన్ స్థాయిలు అధికంగా ఉండే అంతరిక్షంలో మొక్కలు ఏ విధంగా ఉంటాయి? అనేది తెలుసుకునేందుకే ప్రయోగం చేసినట్టు వారు చైనా పేర్కొంది. అయితే తాము ఊహించినట్టు కాకుండా 30 సెంటీమీటర్ల మేర మొక్కలు ఎదిగినట్టు వ్యోమోగాములు చెబుతున్నారు.

Also Read: Aadhaar Card Themed Ganesh pandal: దేవుడికే ఆధార్ కార్డు ఇచ్చేశారు

China Rice Plants Zero-Gravity
China Rice Plants Zero-Gravity

 

గత ఏడాదిలో..
అయితే చైనా పంటల ప్రయోగం ఇప్పటిది కాదు. గత ఏడాది జూలైలో కూడా ఇదే విధంగా అంతరిక్షంలో మొక్కలు పెంచేందుకు ప్రయత్నించింది. చాంగ్ 5 అనే మిషన్ తో వ్యోమోగామి బృందం వరి మొక్కలను పెంచే ప్రయత్నం అయితే అప్పట్లోనే చేసింది. కానీ తాజాగా వరి, క్యాబేజీ మొక్కల పెంపకం విజయవంతం కావడంతో చైనీస్ అకడమీ ఆఫ్ సైన్స్ ఒక వీడియోను విడుదల చేసింది. సోషల్ మీడియాలో పోస్టు చేసింది. భూమిలో కృత్రిమంగా పంటలు సాగుచేయవచ్చని..కానీ మైక్రో గ్రావిటీలో మొక్కల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంపైనే చైనా దృష్టిసారించినట్టు ఆ దేశ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికైతే సమీప భవిష్యత్ లో చైనా అంతరిక్షంపై అన్నదానం చేయనుందన్న మాట.

Also Read:Pawan Kalyan Remakes: పవన్ కల్యాణ్ కెరీర్ లో రీమేక్ హిట్స్..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version