Homeఅంతర్జాతీయంభారతీయ వైద్యుడిని స్మరించుకుంటున్న చైనా.. ఎందుకంటే?

భారతీయ వైద్యుడిని స్మరించుకుంటున్న చైనా.. ఎందుకంటే?


భారత్-చైనా మధ్య కొద్దికాలంగా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. భారత సరిహద్దుల్లోని గాల్వానా లోయలో ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణలో 21మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెల్సిందే. ఈ ఘర్షణలో చైనాకు చెందిన జవాన్లు కూడా భారీ సంఖ్యలో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే చైనా మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో భారత్ చైనాకు చెందిన పలు కంపెనీల కాంట్రాక్టులు.. యాప్స్ ను బ్యాన్ చేసి షాకిచ్చింది. ఇదిలా ఉంటే ఓ భారతీయుడు కాంస్య విగ్రహాన్ని చైనాలో ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

Also Read: ‘లవ్ జిహాద్’.. మతం పేరిట యుద్ధం

భారత్-చైనా ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో చైనా ఓ భారతీయ వైద్యుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనుండటం ఆసక్తిని రేపుతోంది. వచ్చే నెలలో ఓ మెడికల్ కళాశాల ఎదుట భారతీయ వైద్యుడి విగ్రహం ఏర్పాటు చేసేందుకు చైనా సన్నహాలు చేస్తోంది. దీంతో ఆ భారతీయుడు ఎవరా? అనే ఆసక్తి నెలకొంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చైనాలో ఓ భారతీయ వైద్యుడు చేసిన సేవలను గుర్తింపుగా చైనా ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది.

Also Read: గల్వాన్ లో చైనా సైనికులు చనిపోయారు.. ఇదిగో సాక్ష్యం..

మహారాష్ట్రలోని షోలపూర్ చెందిన ద్వారకానాథ్ కోట్నీస్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చైనాకు వెళ్లారు. జపాన్ దురాక్రమణపై పోరాడుతున్న కమ్యూనిస్టు సైనికులకు ఆయన వైద్య సేవలందించారు. 1938లో చైనాకు వెళ్లిన కోట్నిస్ చనిపోయేంతవరకు అంటే 1942 వరకు అక్కడే ఉన్నారు. చైనా యువతినే పెళ్లి చేసుకున్నాడు. చనిపోయేటప్పటికీ కోట్నీస్ వయస్సు 32ఏళ్లే. ఆయన సేవలకు గుర్తింపు చైనాలోని షిజియాజువాంగ్ నగరంలోని ఒక మెడికల్ కాలేజీ ఎదుట వచ్చే నెలలో కోట్నీస్ కాంస్య విగ్రహాం ఏర్పాటు చేయబోతుంది. ఇది ఒకరకంగా భారతీయులకు గర్వకారణమే అని చెప్పొచ్చు. ఇప్పటికైనా చైనా భారత్ పట్ల తన వైఖరిని మార్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version