spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Delhi Tour: మరోసారి ఢిల్లీకి.. ఈసారి సీరియస్ గానే?

Chandrababu Delhi Tour: మరోసారి ఢిల్లీకి.. ఈసారి సీరియస్ గానే?

Chandrababu Delhi Tour: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పొత్తు కోసం తపిస్తున్నారు. పొత్తులతోనే పార్టీని గట్టెక్కించాలని చూస్తున్నారు. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన బీజేపీతో ఉండాలని భావిస్తున్నారు. కేంద్రంలో మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతుండటంతో బీజేపీతోనే జట్టు కట్టాలని భావిస్తున్నారు. అదే సమయంలో వైసీపీని అధికారానికి దూరం చేయాలని తలపోస్తున్నారు.ఇవన్నీ జరగాలంటే బీజేపీ సాయం కావాలని చూస్తున్నారు.

Chandrababu Delhi Tour
Chandrababu Delhi Tour

రాష్ర్టంలో శాంతిభద్రతలు సరిగా ఉండటం లేదని, డీజీపీని రీకాల్ చేయాలని బీజేపీ నేతలను కోరాలని ప్రణాళిక రచించుకుంటున్నారు. ప్రధాని, హోం మంత్రులను కలవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈనెల 31న పార్లమెంట్ సమావేశాలు కానుండటంతో అందరు ఢిల్లీలోనే ఉంటారని వారిని కలవడం సులభమని భావించి వారి అపాయింట్ మెంట్ కోరాలని రెడీ అవుతున్నారు.

గతంలోనే టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడుల గురించి ఫిర్యాదు చేయాలని ఢిల్లీ వెళ్లినా అందరి అపాయింట్ మెంట్ దొరకలేదు. అందుకే రాష్ర్టపతిని కలిసి పరిస్థితిని వివరించారు. కానీ ఈసారి అలా కాకుండా వైసీపీ నేతలను టార్గెట్ చేసుకుని వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని గట్టిగా చెప్పేందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Chandrababu Naidu: చంద్రబాబులో నిజంగానే మార్పు వచ్చిందా?

చంద్రబాబు గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంతో విభేదించి ఒంటరైపోయారు. ఫలితంగా అధికారానికి దూరమైపోయారు. ఈ మధ్య బీజేపీతో సత్సంబంధాలు కొనసాగుతున్న క్రమంలో బీజేపీతోనే పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. పైగా బీజేపీకి కూడా ప్రాంతీయ పార్టీల అవసరం ఉన్నందున టీడీపీకి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబుకు లైన్ క్లియర్ అవుతుందా? లేదా? అనేది సందేహం.

రాబోయే రోజుల్లో ఉత్తరాదిలో మెజార్టీ రాకుండా దక్షిణాది ప్రాంతాలపైనే బీజేపీ ఆధారపడుతుందని తెలుస్తోంది. అందుకే ప్రాంతీయ పార్టీలను దగ్గర ఉంచుకోవాలని భావనలో అధిష్టానం భావిస్తోంది. ఇందుకోసమే వారికి అవసరమైన సాయం చేస్తూ వారిని భవిష్యత్ లో సాయం చేయాలని కోరినా ఆశ్చర్యపడనక్కర్లేదని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి తమ నేతలపై జరుగుతున్న దాడులపై వివరించనున్నట్లు సమాచారం.

Also Read: Chandrababu: చంద్రబాబు చాణక్యం.. టీడీపీ చేతిలోకి మరో అస్త్రం.. ఈ సారి విక్టరీ గ్యారెంటీ..!

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper