నీతులు చెబుతున్న బాబు..

రాష్ట్రంలో ఏవేని ఎన్నికలు వచ్చాయంటే బదిలీలు కామన్‌. ఇప్పుడు ఏపీలో లోకల్‌ బాడీ ఎలక్షన్ల టైమ్‌ నడుస్తోంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పుడు బదిలీల ప్రక్రియ నడిపిస్తోంది. వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర డీజీపీనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం విధుల నుంచి త‌ప్పించింది. ఆయన స్థానంలో మరొకరిని నియమించారు. ఆ బ‌దిలీని ఎవరూ కూడా వ్యతిరేకించలేదు. ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం చెప్పిన‌ట్టుగా చేసింది. […]

Written By: Srinivas, Updated On : January 27, 2021 3:53 pm
Follow us on


రాష్ట్రంలో ఏవేని ఎన్నికలు వచ్చాయంటే బదిలీలు కామన్‌. ఇప్పుడు ఏపీలో లోకల్‌ బాడీ ఎలక్షన్ల టైమ్‌ నడుస్తోంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పుడు బదిలీల ప్రక్రియ నడిపిస్తోంది. వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర డీజీపీనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం విధుల నుంచి త‌ప్పించింది. ఆయన స్థానంలో మరొకరిని నియమించారు. ఆ బ‌దిలీని ఎవరూ కూడా వ్యతిరేకించలేదు. ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం చెప్పిన‌ట్టుగా చేసింది.

Also Read: బాబుగారి మరో భారీ కుంభకోణం.. బట్టబయలు చేసిన కాగ్

గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల స‌మ‌యం నుంచి చంద్రబాబు నాయుడు ఎన్నిక‌ల సంఘం తీరునే ఆక్షేపిస్తూ వ‌చ్చారు. తీరా పోలింగ్ రోజున వెళ్లి కేంద్ర ఎన్నిక‌ల సంఘం రాష్ట్ర ప్రతినిధిగా ఉండిన ద్వివేదితో ముఖాముఖి గొడ‌వ‌కు దిగారు. ఎన్నిక‌ల సంఘం ఆఫీసుకు వెళ్లి.. చంద్రబాబు నాయుడు గొడ‌వ పెట్టుకున్నారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉండగా కూడా చంద్రబాబు ఎన్నికల కమిషన్‌తో గొడవకు దిగారు. అలాంటి బాబు ఇప్పుడు మీడియా ముందుకొచ్చి నీతులు చెబుతున్నారు.

గజినీలా గతాన్ని మరిచి చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. అంటే.. తాను చేస్తే న్యాయం.. మిగితా వారు చేస్తే అన్యాయం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని బాహాటంగానే అంటున్నారు. ఆ సంగ‌త‌లా ఉంటే.. ఏపీలో స్థానిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో అధికారుల బ‌దిలీల ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే ప‌లు జిల్లాల క‌లెక్టర్లను త‌ప్పించారు. ఎస్పీల‌ను కూడా త‌ప్పిస్తున్నారు. వారి స్థానంలో వేరే వారికి బాధ్యతలు అప్పగించడానికి లిస్టు పంపాల‌ని ఎస్ఈసీ కోర‌గా.. ఆ మేర‌కు ప్రభుత్వం ముగ్గురు జాబితాల‌ను పంపినట్లు సమాచారం.

Also Read: మనకో న్యాయం.. మందికో న్యాయమా..! : ఏకగ్రీవాలపై ఎందుకింత ఏడుపు

అయితే.. ఆ జాబితాను కూడా ఎస్ఈసీ తిర‌స్కరించిన‌ట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వివిధ కార‌ణాల‌తో వారు కూడా ఎస్ఈసీకి న‌చ్చన‌ట్టుగా తెలుస్తోంది. మ‌రి అంతిమంగా ఈ పంచాయ‌తీ ఎన్నిక‌లు పూర్తయ్యే లోగా.. ఏపీలో ఎంత‌మంది క‌లెక్టర్లు బాధ్యత‌ల నుంచి త‌ప్పుకోవాల్సి వస్తుందో.. ఇంకా ఎన్ని పరిణామాలు చూడాల్సి వస్తుందోనని ఆసక్తి రేపుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్