
పార్టీ తరఫున ఏయే విషయాలపై పోరాడాలి? ప్రభుత్వాన్ని ఎలా టార్గెట్ చేయాలి? గతంలో తాము ఏం చేశాం.. అనే విషయాలపై పెద్ద ఎత్తున చంద్రబాబు తమ్ముళ్లకు దిశానిర్దేశం చేస్తుంటారు. అయితే.. అదే సమయంలో తన అనుకూల మీడియాకు కూడా చంద్రబాబు బ్రీఫింగ్ ఇస్తున్నారని టీడీపీలో చర్చ సాగుతోంది. ఆది నుంచి అనుకూల మీడియాతో నిత్యం టచ్లో ఉండేవారు చంద్రబాబు. కానీ.. పార్టీ ఓటమి తర్వాత.. ఒకింత అనుకూల మీడియాపై ఆయన గుస్సాగా ఉన్నారు. అనుకూల మీడియాలో తనను ప్రొజెక్టు చేయడంలో కొంత వెనుకబాటు కనిపించిందనేది చంద్రబాబు ఆవేదన.
Also Read: ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ మున్సిపాల్టీ ఏంటి..? : పెదవి విరుస్తున్న ప్రజలు
ఇది చంద్రబాబుదే కాదు తమ్ముళ్ల ఆవేదన కూడా. పార్టీ ఘోరంగా ఓడిపోయాక టీడీపీకి ఎంత భజన చేసినా ఛానెల్స్కు రేటింగ్ కూడా రాకపోవడంతో టీడీపీ కార్యక్రమాలు హైలెట్ చేయడం కాస్త తగ్గించారు. అమరావతి ఉద్యమాన్ని టీడీపీ అనుకూల మీడియా ఎంత మోసినా ఊపు రాలేదు. ఇక చంద్రబాబు కూడా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత హైదరాబాద్లోనే ఉంటూ కొన్నాళ్ల పాటు మౌనంగా ఉన్నారు. ఇక.. ఇటీవల కాలంలో జగన్ దూకుడు పెరగడం.. టీడీపీ తమ్ముళ్లు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరం కావడంతో చంద్రబాబు ఇటు పార్టీని.. అటు అనుకూల మీడియాను కూడా మేనేజ్ చేస్తున్నారనే చర్చ సాగుతోంది.
Also Read: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం..: జగన్ వైఖరి అలానే ఉందట
ఇటు పార్టీ నేతలతో టచ్లో ఉంటూనే మరోవైపు అనుకూల మీడియా అధినేతలతో నిత్యం టచ్లో ఉంటున్నారని టీడీపీలోనే చర్చ సాగుతోంది. చంద్రబాబు కనుసన్నల్లోనే కథనాలు వస్తున్నాయని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా జగన్ దూకుడుగా ఉండడం, వివిధ పథకాలు అమలు చేస్తుండడంతో ప్రజల దృష్టిని మళ్లించేలా కథనాలు రాయిస్తున్నారని టీడీపీ వర్గాల్లోనే చర్చ సాగుతుండడం గమనార్హం. మరి ఈ మీడియా మేనేజ్ టీడీపీకి, చంద్రబాబుకు ఎంత వరకు కలిసొస్తుందో ? చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్