Homeఆంధ్రప్రదేశ్‌బాబుకు గోరంత ఆనందం, కొండంత విచారం...!

బాబుకు గోరంత ఆనందం, కొండంత విచారం…!


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తిరిగి నియమిస్తూ ప్రభుత్వం గత రాత్రి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనితో రాత్రి నుండి టీడీపీ మీడియా పాపం పనిగట్టుకుని మరీ దీన్ని ప్రచారం చేసింది. ప్రభుత్వంపై నిమ్మగడ్డదే పై చేయి అయ్యింది, ప్రభుత్వానికి న్యాయస్థానాల మొట్టికాయలు, ఏ దారిలేని వైసీపీ ప్రభుత్వం గవర్నర్ ఆదేశాలు పాటించింది అంటూ కథనాలు రాయడం జరిగింది. ఇది నిజంగా టీడీపీ సెలెబ్రేట్ చేసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే నిమ్మగడ్డ పోరాటంలో టీడీపీ అన్నీ తానై నడిపింది. నిమ్మగడ్డ ప్రతి అడుగులో వెనకుండి ప్రోత్సహించింది. నిమ్మగడ్డ నియామకంతో తన పంతం నెగ్గినట్టుగా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. నిమ్మగడ్డ విజయాన్ని తమ విజయంగా ఆస్వాదిస్తున్నాయి.

Also Read: చినబాబు ‘సైకిల్ యాత్ర’ సాహాస యాత్రగా మారనుందా?

ఐతే వీరి సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. వీరి తాత్కాలిక ఆనందానికి గవర్నర్ నిర్ణయం శాశ్వతమైన బాధను మిగిల్చింది. నిమ్మగడ్డ నియామకం టీడీపీకి కేవలం తాత్కాలికంగా ఉపశమనం కలిగించే అంశమే. ఎందుకంటే పదవి కాలం ముగియగానే, నిమ్మగ్గడ్డ ఆ కుర్చీ నుండి తప్పుకోవాల్సివుంటుంది. కానీ నేటి గవర్నర్ నిర్ణయం శాశ్వతంగా చంద్రబాబు కలలను కూల్చివేసింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు పాలనా వికేంద్రీకరణ మరియు సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు ఆమోదం తెలిపారు. దీనితో అమరావతి నుండి రాజధానిని వైజాగ్ కి తరలించాలన్న జగన్ నిర్ణయానికి మార్గం సుగమం అయ్యింది. ఇప్పటికే వైజాగ్ కేంద్రంగా పరిపాలన సాగించడానికి జగన్ భూముల సేకరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి విషయాలపై దృష్టి సారించడంతో పాటు, ఆ దిశగా కొంత పని కూడా మొదలుపెట్టారు. గవర్నర్ నిర్ణయం ఏమవుతుందో అని రెండు వారాలకు పైగా ఎదురుచూస్తున్న ప్రభుత్వానికి తీపి కబురు అందింది.

Also Read: మీడియాకు చంద్రబాబు ఎంత పంచాడో తెలుసా?

ఇక రాజధాని మార్పు అనేది అనివార్యం అవుతున్న తరుణంలో బాబుకు ఈ విషయం అసలు మింగుడు పడడం లేదు. ఎలాగైనా తానుశంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని కాపాడుకోవాలని బాబు చేసిన విశ్వప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో ఏమి పాలుపోవడం లేదు. టీడీపీ నిర్ణయానికి అనుకూలంగా గవర్నర్ తీర్పు నేపథ్యంలో, ఆయనపట్ల బాబు వైఖరి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. కొద్దిరోజుల క్రితం నిమ్మగడ్డకు తిరిగి బాధ్యతలు అప్పగించాలంటూ గవర్నర్ చెప్పిన తరుణంలో ఆయన తీర్పును బాబు స్వాగతించారు. రాజ్యాంగాన్ని కాపాడారని కొనియాడారు. మరి నేటి గవర్నర్ నిర్ణయం బాబుకు గొడ్డలి పెట్టు కాగా ఆయన స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...
Oktelugu Epaper
Exit mobile version