spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Arrest: నేడు చంద్రబాబు కేసుల్లో కీలకం

Chandrababu Arrest: నేడు చంద్రబాబు కేసుల్లో కీలకం

Chandrababu Arrest: చంద్రబాబు కేసుల విషయంలో నేడు కీలకం. ఇటు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో విచారణలు కొనసాగనున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటు ఫైబర్ నెట్, అంగళ్ల అల్లర్ల కేసు విచారణలు జరగనున్నాయి. కోర్టుల ఆదేశాలు వెల్లడి కానున్నాయి. దీంతో చంద్రబాబుకు శుక్రవారం కీలకంగా మారింది.

అంగళ్ళ అల్లర్ల కేసుకు సంబంధించి చంద్రబాబుకి ముందస్తు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనే దానిపై ఇవాళ ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో చంద్రబాబు ఏ1 నిందితుడిగా ఉన్నారు. మొత్తం 179 మంది పై పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు రెండు వైపులా వాదనలు విని.. తీర్పును రిజర్వులో ఉంచింది. ఇవాళ తీర్పు వెల్లడి కానుంది.

ఏపీ స్కిల్ స్కామునకు సంబంధించి చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. ఈ కేసు కొట్టివేయాలని, తనను విడుదల చేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, సిఐడి తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు.

మరోవైపు ఫైబర్ నెట్ కేసులకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో నేడు విచారణకు రానుంది. ఇప్పటికే ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురైంది. ఈ తరుణంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అది కోర్టులో రిజిస్టర్ అయి ఉంది. నేడు విచారణకు రానుంది. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్ర వాదనలు వినిపించనున్నారు. శుక్రవారం ఏకకాలంలో చంద్రబాబుకు చెందిన మూడు కేసులకు సంబంధించి విచారణలు కొనసాగనున్నాయి. దీంతో ఉత్కంఠ నెలకొంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version