రూ.50 లక్షలు లంచం ఇస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. దీనికి ముందు స్టీఫెన్ సన్ తో చంద్రబాబు ఫోన్ సంభాషణ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు అప్పుడు ఎంత వైరల్ అయిందో అందరికి తెలుసు. ఈ ఎపిసోడ్ లో బాబు ఫోన్ సంభాషణ ఆయన్ను దోషిగా నిలబెట్టింది. రాజకీయంగా దెబ్బతీసింది. పదేళ్ల పాటు హైదరాబాద్ లో ఉండాల్సిన దానికి భిన్నంగా అప్పటికప్పుడు హడావిడిగా భాగ్యనగరాన్ని వదిలేయాల్సిన అవసరం ఏర్పడింది.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో కూడా చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. రఘురామను అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు ఆయన ఫోన్ స్వాధీనం చేసుకుని అందులోని డేటాను విశ్లేషించగా నివ్వెరపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో దాఖలుచేసిన పిటిషన్ కు సంబంధించిన అంశాల్ని బాబు నేరుగా పరిశీలించారనే సీఐడీ నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి ముందు రఘురామ స్వయంగా ఆ కాపీని చంద్రబాబుకు వాట్సాప్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అందులో మార్పు చేర్పుల కోసం వాట్సాప్ చాట్స్ చేసుకున్న వైనం గుర్తించారు. దీంతో అప్పట్లోనే ఫోన్ షాక్ తో రాజకీయంగా దారుణంగా దెబ్బ తిన్న బాబు మరోసారి ఎదురుదెబ్బ తిన్నారని అనిపిస్తోంది. ఈ సారి మాత్రం ఫోనే కీ రోల్ ప్లే చేయడం గమనార్హం. చంద్రబాబుకు ఫోన్ రాజకీయాలు అంతగా అచ్చిరాలేదన్న విషయం తెలుస్తోంది.