Homeజాతీయ వార్తలుమమత యాక్షన్.. కేంద్రం రియాక్షన్

మమత యాక్షన్.. కేంద్రం రియాక్షన్

యాస్ తుఫాన్ పలు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఏపీ, ఒడిషా రాష్ట్రాలతోపాటు పశ్చిమ బెంగాల్లో విధ్వంసం సృష్టించింది. ఈ నేపథ్యంలో బెంగాల్లో జరిగిన నష్టంపై పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని కలైకుండలో ప్రధాని సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గవర్నర్ జగదీప్ ధనఖర్, బెంగాల్ విపక్ష నేత సువేందు అధికారి హాజరయ్యారు. కానీ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం దాదాపు అరగంట ఆలస్యంగా వచ్చారు.

యాస్ తుఫాను వల్ల బెంగాల్ కు జరిగిన నష్టంపై ప్రధానికి వినతిపత్రం అందించి వెళ్లిపోయారు. ఇక, బెంగాల్ కు చెందిన చీఫ్ సెక్రెటరీతోపాటు ఇతర అధికారులు ఎవరూ సమావేశానికి హాజరు కాలేదు. మమత తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజకీయాలు ఎలా ఉన్నా.. ఇలాంటి విపత్కర సమయంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల విషయంలో ఇలా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది.

అయితే.. మమత చర్యపై కేంద్రం వెంటనే స్పందించింది. ప్రధాని సమావేశానికి హాజరుకానందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయ్ ను రీకాల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నాలుగు రోజుల క్రితమే ఆయన పదవీ కాలాన్నిమూడు నెలలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ప్రధాని సమీక్షలో మమత వ్యవహరించిన తీరుపట్ల రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్ కూడా అసంతృప్తి వ్య‌క్తం చేశారు. బెంగాల్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రధాని సమక్షంలో జరిగిన సమావేవానికి సీఎం, అధికారులు హాజరు కావాల్సి ఉందన్న ఆయన.. వారి గైర్హాజరీ సరైంది కాదని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

దీంతో.. బెంగాల్లో ఎన్నికలు ముగిసినప్పటికీ.. కేంద్రం లోని బీజేపీ, రాష్ట్రంలోని టీఎంసీ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉందన్న విషయం మరోసారి తేటతెల్లం అయ్యిందని అంటున్నారు.

 

 

 

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version