Chicken
Chicken : ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కోళ్లు మృతి చెందుతున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించారు. ప్రజలు అనవసరంగా అపోహలకు లోనవ్వొద్దని, కోళ్ల మృతికి గల కారణాలను సమగ్రంగా పరిశీలిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. కోళ్ల మరణాలతో పాటు గుడ్లు, చికెన్ వినియోగం వల్ల అనారోగ్యం సంభవిస్తుందన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు.
కోళ్ల మృతికి అసలు కారణం
పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రాథమిక పరిశోధనలో కొన్ని కీలకమైన అంశాలను గుర్తించారు. ప్రస్తుతం కోళ్ల మృతికి పక్షుల వలసలు ఒక కారణంగా భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం శీతాకాలంలో వేలాది వలస పక్షులు కొల్లేరు సరస్సు ప్రాంతానికి వచ్చే విషయం తెలిసిందే. ఈ వలస పక్షుల వల్ల కొన్ని వైరస్లు వ్యాపించే అవకాశం ఉంది. దీని ప్రభావం సమీప ప్రాంతాల్లో ఉన్న కోళ్ల పై పడుతున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, దీనిపై ఇంకా ఖచ్చితమైన నివేదిక రావాల్సి ఉంది.
కోళ్ల మృతిపై అధికారులు ఏమంటున్నారు?
పశుసంవర్ధక శాఖ అధికారులు మాట్లాడుతూ..‘‘ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికావద్దు. కోళ్ల మృతికి ఇతర కారణాలే ఉండొచ్చు. ప్రజలు గుడ్లు, చికెన్ను తినడంలో ఎటువంటి భయాందోళన అవసరం లేదు. ఉడికించిన లేదా సరిగ్గా వండిన చికెన్, గుడ్లు తినడంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకపోవచ్చు” అని వారు స్పష్టం చేశారు.
కోళ్లు, గుడ్లు తినడంపై భయం వద్దు
ఈ ఘటనలతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కోడి మాంసం, గుడ్లు వినియోగం భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. ప్రజలు అపోహలు పెంచుకోవద్దని, పరిశుభ్రంగా వండిన లేదా ఉడికించిన గుడ్లు, చికెన్ పూర్తిగా భయం లేకుండా తినొచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వం చేపట్టిన చర్యలు
కోళ్లు మృతి చెందిన ప్రాంతాలలో అధికారుల బృందాలు ఈ ఘటనపై సమగ్రంగా విచారణ చేపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పౌల్ట్రీ ఫారమ్లను పర్యవేక్షిస్తున్నారు. అనుమానాస్పదమైన కోళ్ల మృతిపై వెంటనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లో అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ప్రజలకు ప్రభుత్వ సూచనలు
ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. గుడ్లు, చికెన్ భద్రంగా తినాలంటే బాగా ఉడికించి తినాలని సూచించింది. అలాగే కోళ్ల ఫారమ్లలో శుభ్రత పాటించాలని ఆదేశించింది. అనారోగ్య లక్షణాలు ఉన్న కోళ్లను తినకుండా అధికారులకు సమాచారం అందించాలని పేర్కొంది. అటు పౌల్ట్రీ రైతులు కూడా కోళ్ల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పింది. మొత్తానికి, ఏపీలో చోటుచేసుకుంటున్న కోళ్ల మృతిపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అర్థం అవుతుంది. అధికారులు దీనిపై సమగ్ర పరిశోధన చేస్తున్నారు. కోళ్లు, గుడ్లు తినడంలో ఎటువంటి హాని లేదని అధికారులు స్పష్టమైన ప్రకటన కూడా ఇచ్చారు. ప్రజలు అపోహలకు లోనవకుండా, ప్రభుత్వ సూచనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Cant eat your favorite this is the reason for so much fear
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com