spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP BJP: బీజేపీ నేతల దూకుడు.. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల సందర్శనతో పార్టీకి ఊపు

AP BJP: బీజేపీ నేతల దూకుడు.. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల సందర్శనతో పార్టీకి ఊపు

AP BJP: ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల సందర్శన బీజేపీకి బాగానే మైలేజ్ వచ్చింది. అటు ప్రాజెక్టుల పనుల పరిశీలనతో పాటు నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు కార్యక్రమం చక్కటి వేదికగా నిలిచింది. రాష్ట్ర బీజేపీ నేతలు ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమం నిర్వహించిన తీరు సర్వత్రా అభినందనలు అందుకుంది. శ్రీకాకుళం జిల్లా వంశధార ఫేజ్2 రిజర్వాయర్ నిర్మాణ పనుల పరిశీలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బీజేపీ నాయకులు పదునైన మాటలతో అటు అధికార పక్షం వైసీపీకి, గతంలో అధికారం వెలగబెట్టిన టీడీపీకి బాగానే ఇరుకున పెట్టారు. రిజర్వాయర్ల నిర్మాణానికి సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల మనసులను సైతం దోచుకున్నారు. అధికార, విపక్షాలను తూర్పారపడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కడిగిపారేశారు. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించిన ఆయన బీజేపీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురాగలిగారు. తొలిరోజు సందర్శించిన పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో బీజేపీ నేతలకు సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

Somu Veerraju
Somu Veerraju

 

గ్రౌండ్ లెవల్ లో బీజేపీకి మంచి ఆదరణ ఉందని గ్రహించిన నేతలు స్పీడ్ పెంచారు. హిరమండలంలోని వంశధార రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభకు వేలాది మంది నిర్వాసితులు, స్థానికులు నేతల ప్రసంగాలను ఆసాంతం విన్నారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్ కు చేసిన సాయం గురించి సాదోహరణంగా వివరించినప్పుడు సభికుల నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. నాడు టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులకు చేసిన అన్యాయం, బలవంతంగా గ్రామాలు ఖాళీ చేయించిన తీరును తప్పుపట్టడమే కాకుండా.. ఎంతో నమ్మకంతో గెలిపించిన వైసీపీ వంచించిన తీరును వీర్రాజు ఎండగట్టారు.

Also Read: Rythu Bima: తెలంగాణ రైతులకు అలర్ట్.. ఈ స్కీమ్ తో కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్!

బీజేపీపై ఉన్న అపవాదు ఒట్టిదేనని అక్కడకు వచ్చిన నిర్వాసితులు సంత్రుప్తి చెందేలా బీజేపీ నేతలు వారికి భరోసా కల్పించారు. అటు ఒడిశాతో వివాదాస్పదమైన వంశధార తీరమైన నేరడిని సోము వీర్రాజుతో పాటు బీజేపీ నాయకులు సందర్శించారు. ఒడిశాతో నెలకొన్న జల వివాదం, జాతీయ స్థాయిలో తీసుకోవాల్సిన పరిష్కార మార్గాలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటిని నోటిఫై చేశారు. బీజేపీ జాతీయ నాయకత్వం ద్రుష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కార మార్గం చూపుతామని చెప్పడంతో స్థానికులకు ఎంతో నమ్మకం కుదిరింది. మూడు రోజుల పర్యటనలో తొలిరోజు సిక్కోలు వాసులకు భరోసా కల్పించడంలో సోము వీర్రాజు నేత్రుత్వంలోని బీజేపీ నేతలు సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు.

మాటల దాడి
రెండో రోజు పర్యటనలో భాగంగా పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన గళాన్ని వినిపించారు. మంత్రివర్గ విస్తరణ, రాజకీయాలతో బిజీగా ఉన్న ప్రభుత్వ పెద్దలకు సెగ తాకేలా విమర్శల జడివాన కురిపించారు. తోటపల్లి, వట్టిగెడ్డ, వెంగళరాయ సాగర్ ప్రాజెక్టుల పరిస్థితిని చూసి చలించిపోయిన ఆయన అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తాజా మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ఫశ్రీవాణి తీరుపై విరుచుకుపడ్డారు. డిప్యూటీ సీఎం పదవి వెలగబెట్టి కనీసం రూ.10 లక్షల నిధులనైనా.. ప్రాజెక్టుల నిర్వహణకు మంజూరు చేయించుకున్నారా? అని ప్రశ్నించారు.

Somu Veerraju
somu veerraju

కేంద్రం అందించే ఉపాధి నిధులతో ఇంటిని నిర్మించుకున్నారంటూ స్థానికుల గొంతునై వీర్రాజు చేసిన కామెంట్స్ అటు తాజా మాజీ డిప్యూటీ సీఎంకు గట్టిగానే తగిలాయి. ఇటు స్థానికులు, గిరిజనుల అభిమానాన్ని చూరగొన్నాయి. తోటపల్లి ఆధునికీకరణ పనుల్లో జాప్యం, నిధుల కేటాయింపులో వివక్షను కూడా బీజేపీ నేతలు తప్పుపట్టారు. తాటిపూడి, తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టుల స్థితిగతులను తెలుసుకున్న నాయకులు స్థానికులు, నిర్వాసితుల నుంచి వివరాలు సేకరించి నోట్ చేసుకున్నారు. కేంద్ర నాయకత్వం ద్రుష్టికి తీసుకెళ్లడంతో పాటు శాసనమండలిలో ప్రస్తావించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వంపై ముప్పేట దాడి
ఉత్తరాంధ్ర ప్రజల తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ ప్రాజెక్ట్ పై బీజేపీ నేతలు గట్టిగానే ఫోకస్ పెట్టారు. దివంగత వైఎస్ మానస పుత్రికగా ఉన్న ప్రాజెక్ట్ ను ఆయన కుమారుడు జగన్ ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రజలకు తెలియజెప్పేందుకు నిర్ణయించారు. అటు విశాఖకు తాగునీరందించే తాటిపూడి, మేహాద్రి గెడ్డ రిజర్వాయర్ల దయనీయ పరిస్థితిని కళ్లారా చూసిన బీజేపీ నేతలు వాటిపై గట్టి పోరాటానికి నిర్ణయించారు. రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలన్న తరుణంలో, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల సందర్శన బీజేపీకి జీవం పోసిందనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఇప్పటికే బీజేపీ సందర్శించిన ప్రాంతాలు, నియోజకవర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. దశాబ్దాల తరబడి సమస్యలు పరిష్కరించకుండా అదిగో..ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చిన టీడీపీ, వైసీపీ సర్కారుల పనితీరును స్థానికులు, నిర్వాసితులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ లోపాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయా జిల్లాల బీజేపీ నాయకులు స్పీడు పెంచితే రాజకీయంగా మలుచుకోవచ్చన్న భావన వ్యక్తమవుతోంది.

Also Read:AP Power Cuts: ఏపీలో విద్యుత్ కోతలు ఎప్పటి వరకూ?

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper