నాగార్జున సాగర్ లో ఆశ్చర్యపరిచిన బీజేపీ

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి రాబోయే ఉప ఎన్నిక కోసం తెలంగాణ రాష్ట్ర సమితి నోముల భగత్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని వ్యూహాత్మకంగా ప్రకటించింది. చనిపోయిన నర్సింహయ్య సానుభూతిని పొందేందుకు.. యువతకు అవకాశం ఇచ్చామన్న ఆలోచనతో టీఆర్ఎస్ ఈ ఎత్తు వేసింది. అందుకే బీజేపీ కూడా యువకుడు, విద్యావంతుడికే పట్టం కట్టింది. భారతీయ జనతా పార్టీ అంతకుమించిన అభ్యర్థిని రంగంలోకి దింపింది. ప్రముఖ నాయకుడు, మాజీ హోంమంత్రి కె. జానా రెడ్డిని కాంగ్రెస్ ఇప్పటికే తన అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన […]

Written By: NARESH, Updated On : March 30, 2021 10:25 am
Follow us on

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి రాబోయే ఉప ఎన్నిక కోసం తెలంగాణ రాష్ట్ర సమితి నోముల భగత్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని వ్యూహాత్మకంగా ప్రకటించింది. చనిపోయిన నర్సింహయ్య సానుభూతిని పొందేందుకు.. యువతకు అవకాశం ఇచ్చామన్న ఆలోచనతో టీఆర్ఎస్ ఈ ఎత్తు వేసింది. అందుకే బీజేపీ కూడా యువకుడు, విద్యావంతుడికే పట్టం కట్టింది. భారతీయ జనతా పార్టీ అంతకుమించిన అభ్యర్థిని రంగంలోకి దింపింది. ప్రముఖ నాయకుడు, మాజీ హోంమంత్రి కె. జానా రెడ్డిని కాంగ్రెస్ ఇప్పటికే తన అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన ఇప్పటికే ప్రచారంలో ఇతరులతో ముందున్నాడు.

దివంగత నోముల నరసింహయ్య కుమారుడు భగత్ పేరును టిఆర్ఎస్ ప్రకటించడంతో, ఉప ఎన్నికను సెంటిమెంట్ తో గెలవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. బిజెపికి, టిఆర్ఎస్ కు శక్తివంతమైన ఇద్దరు యువకులు, విద్యాధికులు బరిలో నిలిచారు. దీంతో నాగార్జునా సాగర్ లో టఫ్ ఫైట్ నెలకొంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీకి ఇప్పుడు సాగన్ ను తిరిగి గెలిచి తీరాలనే పట్టుదలతో మెరుగైన అభ్యర్థిని ప్రకటించింది.

టిఆర్‌ఎస్ నుంచి దుబ్బాక సీటును కైవసం చేసుకుని, జిహెచ్‌ఎంసి ఎన్నికలలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన బిజెపికి ఇప్పుడు అదే ఊపులో సాగర్ లోనూ కాషాయ జెండా ఎగురవేసేందుకు రెడీ అవుతోంది.

అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాల రెండు ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో బిజెపికి సాగర్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. కాబట్టి, ఇది నాగార్జునసాగర్లో తప్పనిసరిగా గెలవాలని మంచి అభ్యర్థిని రంగంలోకి దింపింది. బిజెపి నాయకత్వం మంచి ఆర్థిక నేపథ్యం ఉన్న ప్రముఖ ఎస్టీ నాయకుడు పనుగోతు రవి కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. కాంగ్రెస్ నుంచి రెడ్డి సామాజికవర్గం జానారెడ్డి బరిలో ఉండడం.. టీఆర్ఎస్ నుంచి బీసీ నోములకు తగ్గట్టుగా అణగారిన ఎస్టీ నేత రవికుమార్ ను దింపి బీజేపీ షాకిచ్చింది. ఈయన ఆర్థికంగా బాగుండడం.. నియోజకవర్గంలో వైద్యుడిగా మంచి పేరు ఉండడంతో ప్రజలంతా ఈ మంచి డాక్టర్ కు ఓట్లు వేసేందుకు ఆసక్తితో ఉన్నారట.. ఇది ఖచ్చితంగా బీజేపీకి లాభిస్తుందని అంటున్నారు.

అంతేకాదు.. నాగర్జునాసాగర్ నియోజకవర్గంలో పార్టీ ప్రచారానికి నాయకత్వం వహించడానికి సీనియర్ నటి మరియు ఫైర్‌బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని రంగంలోకి దింపింది. ఆమెను ఉప ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది.. విజయశాంతితోపాటు, బండి సంజయ్, డి కె అరుణ, జి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, టి రాజా సింగ్ లు ప్రచారంలో పాల్గొననున్నారు.