spot_img
Homeజాతీయ వార్తలుNitish Kumar must apologize: బీహార్ సీఎం నితీష్ కుమార్ సారీ చెప్పాల్సిందే.. పాక్ గ్యాంగ్...

Nitish Kumar must apologize: బీహార్ సీఎం నితీష్ కుమార్ సారీ చెప్పాల్సిందే.. పాక్ గ్యాంగ్ స్టర్ బెదిరింపులు.. ఎందుకంటే?

Nitish Kumar must apologize: బీహార్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ఆయన పరిపాలన సాగిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అయితే ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటన ఆయనను అంతర్జాతీయ మీడియాలో వ్యక్తిగా చేసింది. ఆయన కేంద్రంగా మీడియా వార్తలను వండి వార్చింది.

ప్రస్తుతానికి బీహార్ రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు లేవు. ఆ రాష్ట్రంలో అధికార పార్టీ కుప్పకూలడానికి దోహదం చేసే పరిస్థితులు కూడా లేవు. కానీ నితీష్ కుమార్ చేసిన ఒక చిన్న పని ఆయనను ఏకంగా ఒక వర్గానికి శత్రువులాగా మార్చింది. దీంతో ఆయన కేంద్రంగా కొద్ది రోజులుగా జాతీయ, అంతర్జాతీయ మీడియా వార్తలను ప్రసారం చేస్తోంది. తాజాగా పాకిస్తాన్ నుంచి కూడా నితీష్ కుమార్ కు ఒక వర్తమానం అందింది. అది కాస్త కలకలం రేపింది.

ఇటీవల నితీష్ కుమార్ ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి చాలామంది హాజరయ్యారు. ఆ సమయంలో ఓ మహిళ వైద్యురాలు హిజాబ్ ధరించి అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె ముఖం చూసేందుకు నితీష్ కుమార్ హిజాబ్ లాగారు.. ఇది కాస్త పెను దుమారాన్ని రేపింది. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆందోళన మొదలు పెట్టారు. హిజాబ్ తొలగించడం సరైన విధానం కాదంటూ మండిపడ్డారు. ఇది వారి సంస్కృతి పై జరుగుతున్న దాడి అని ఆరోపించారు.

ఇది ఇలా ఉండగానే మహిళా డాక్టర్ హిజాబ్ లాగిన ఘటనపై నితీష్ కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని తాజాగా పాక్ గ్యాంగ్ స్టర్ షహ్జద్ భట్టి డిమాండ్ చేశారు. లేదంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.. ” ఆయన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అటువంటి వ్యక్తి ఒక మహిళా వైద్యురాలు హిజాబ్ ధరించి వస్తే.. బహిరంగంగా అలా లాగుతారా? ఇది ఎంతవరకు న్యాయం? ఒక మహిళకు తాను నచ్చిన దుస్తులు ధరించే అవకాశం కూడా లేదా” అంటూ భట్టి సోషల్ మీడియాలో ఆరోపించారు. మరోవైపు దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని డిజిపి వినయ్ కుమార్ పేర్కొన్నారు. బెదిరింపు ఘటనపై సమాచారం అందిన నేపథ్యంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని, ఈ వ్యవహారంపై తమ వద్ద పూర్తిస్థాయిలో వివరాలు లేవని.. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి గురించి.. ఇతర విషయాల గురించి పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని డిజిపి అన్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper
Exit mobile version