Homeజాతీయ వార్తలుజగన్‌, కేసీఆర్‌కు‌ ఎంతో తేడా.. ఇరు రాష్ట్రాల్లో సిచ్యువేషన్‌ ఇలా..

జగన్‌, కేసీఆర్‌కు‌ ఎంతో తేడా.. ఇరు రాష్ట్రాల్లో సిచ్యువేషన్‌ ఇలా..

Jagan KCR
ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సీఎం.. ఒక్కో సీఎం పాలన ఒక్కోలా ఉంటుంది. అందరిదీ ఒకేవిధంగా ఉండాలన్న రూల్‌ ఏమీ లేదు. ఎవరి ప్రత్యేకతలు వారివి. కేసీఆర్, వైఎస్‌ జగన్‌ ఇరు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు. వీరి పాలనా మధ్య తప్పనిసరిగా తేడాలుంటాయి. ఇది చాలా రకాలుగానే ఉంది. తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక తరువాత సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉపఎన్నిక నాగార్జున సాగర్. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు బీజేపీ ద్వారా గట్టి దెబ్బ తగిలింది. ఆ తరువాత వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆధిపత్యానికి బీజేపీ భారీగా గండి కొట్టింది. దాని తరువాత వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కుదేలైంది.

ఆ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లు పట్టభద్రులు మాత్రమే కాబట్టి వాటిని సాధారణ ఎన్నికల కింద పరిగణించరు. ఇక ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరగబోతోంది. దీన్ని కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. ఇక్కడ ఆయన ప్లాన్ బీజేపీని దెబ్బకొట్టడం కంటే కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టడం ముఖ్యం. అయితే.. మరోవైపు బీజేపీ భయాన్ని సైతం తీసిపారేయలేం. వాస్తవానికి సాగర్‌‌లో గెలిస్తే టీఆర్ఎస్ గెలవాలి లేదా కాంగ్రెస్ గెలవాలి.

సాగర్‌‌లో బీజేపీకి అంత సీన్‌లేదని నిపుణులు చెప్తున్న మాట. మరి ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కేసీఆర్‌‌కు కాంగ్రెస్‌ అంటే భయమా..? లేక బీజేపీ అంటేనా..? అనేది తెలియకుండా ఉంది. ఉప ఎన్నికపై పార్టీ నాయకులతో మాట్లాడిన కేసీఆర్ దుబ్బాకలో తాను ప్రచారానికి వెళ్లకపోవడం వల్లనే అక్కడ ఓడిపోయామని, అందుకే సాగర్‌‌లో ప్రచారానికి తానూ, కేటీఆర్ వస్తామని చెప్పారు. అంటే తండ్రీకొడుకులు అక్కడ ప్రచారం చేస్తారన్నమాట. సాధారణంగా ఉప ఎన్నికలను అధికార పార్టీలు అంతగా పట్టించుకోవు. అందుకే.. ప్రచారానికి ముఖ్యమంత్రులు వెళ్లరు. కేవలం ప్లాన్ చెప్పి వదిలేస్తారు. మంత్రులకు, పార్టీ ముఖ్యులకు బాధ్యతలు అప్పగిస్తారు.

ఇక ఏపీలో ఈమధ్య పంచాయతీ ఎన్నికల తరువాత మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఓ పక్క అమరావతి ఉద్యమం, మరోపక్క విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమం, మరోపక్క మూడు రాజధానుల వ్యవహారం.. ఈ కారణంగా ఈ ఎన్నికలను టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు రెఫరెండంగా ప్రచారం చేశాయి. జగన్ పట్ల జనంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ఓ వర్గం మీడియా కోడైకూసింది. అయినా జగన్ ఓటమి ఎదురవుతుందని ఎక్కడా భయపడలేదు. ఎన్నికల్లో ఎక్కడా ప్రచారమే చేయలేదు. వైసీపీని గెలిపించాలని వ్యక్తిగతంగానూ ప్రజలకు విజ్ఞప్తి చేయలేదు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులంతా తిరిగి చమటోడ్చారు. కానీ.. వైసీపీ మున్సిపల్ ఎన్నికల్లో సునామీ సృష్టించింది.

మరి ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్‌‌ ఒక్క ఉప ఎన్నిక కోసం చెమటోడ్చాల్సి వస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా ఆయన.. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొడుకు కేటీఆర్‌‌ ప్రచారం రంగంలోకి దిగాల్సి వస్తోంది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో ఇప్పుడు ప్రతిపక్షాలు అంత బలంగా లేవు. టీడీపీని ప్రజలే స్వయానా నమ్మలేకపోతున్నారు. బీజేపీ–జనసేన పోరాడుతున్నా పెద్దగా ఫలితాలు రావడం లేదు. దీంతో జగన్‌ తాపీగా ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నికపై కూడా ఆయనలో పెద్దగా టెన్షన్‌ కనిపించడం లేదు. కానీ.. కేసీఆర్‌‌ను మాత్రం సాగర్‌‌ ఉప ఎన్నిక కలవరపెడుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version