అందుకే వలస కూలీలకు తీవ్ర ఇబ్బందులు!

లాక్‌ డౌన్‌ ను మే 3 వరకు పొడిగింపు ప్ పై తప్పుడు ప్రచారాలను నమ్మి వలస కూలీలు వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని దీంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌  వెల్లడించారు. లాక్‌ డౌన్‌ పై అపోహలు, అనుమానాలు పెంచుకోకుండా ఎక్కడివారక్కడే ఉండాలని స్పష్టం ఆయన చేశారు. ప్రజలకు,కూలీలకు, వలస కార్మికులకు రాష్ట్ర పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆహార, ఆరోగ్య సమస్యలుంటే ప్రభుత్వ […]

Written By: Neelambaram, Updated On : April 15, 2020 8:03 pm
Follow us on

లాక్‌ డౌన్‌ ను మే 3 వరకు పొడిగింపు ప్ పై తప్పుడు ప్రచారాలను నమ్మి వలస కూలీలు వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని దీంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌  వెల్లడించారు. లాక్‌ డౌన్‌ పై అపోహలు, అనుమానాలు పెంచుకోకుండా ఎక్కడివారక్కడే ఉండాలని స్పష్టం ఆయన చేశారు. ప్రజలకు,కూలీలకు, వలస కార్మికులకు రాష్ట్ర పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆహార, ఆరోగ్య సమస్యలుంటే ప్రభుత్వ యంత్రాంగం లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. లాక్‌ డౌన్‌ సమయంలో ఆశ్రయం కోల్పోయిన వారి కోసం ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేసిందని సజ్జనార్‌ గుర్తు చేశారు.
దేశమంతా లాక్‌ డౌన్‌ తో స్తంభించిన వేళ.. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లినా.. ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. కార్మికుల బాగోగులు చూసుకోవాలని భవన నిర్మాణ సంస్థలు, పలు కంపెనీలకు ఆదేశాలు జారీ చేసాం. ప్రభుత్వ, పోలీస్ శాఖ ఆదేశాలను కార్మిక సంస్థలు, భవన నిర్మాణ సంస్థలు బేఖాతర్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’అని కమిషనర్‌ పేర్కొన్నారు.

కాలినడకన సొంత ప్రాంతాలకు వెళ్లే క్రమంలో చిన్న పిల్లలతో ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారని ఆయన తెలిపారు. జాతీయ రహదారులపై ఎక్కువ దూరం నడవడం వల్ల రోడ్డు ప్రమాదాలు.. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కార్మికులకు, వలస కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని సజ్జనార్ అన్నారు.