Homeఆంధ్రప్రదేశ్‌Kapu Welfare: ఏపీలో ‘కాపు’ సంక్షేమానికి మంగళం.. ఆ లెక్కలతో సరిపెడుతున్న జగన్ సర్కారు

Kapu Welfare: ఏపీలో ‘కాపు’ సంక్షేమానికి మంగళం.. ఆ లెక్కలతో సరిపెడుతున్న జగన్ సర్కారు

Kapu Welfare: ఉమ్మడి రాష్ట్రంలో అయినా.. అవశేష ఆంధ్రప్రదేశ్ లో అయినా జనాభాపరంగా కాపులదే అగ్రస్థానం. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు వారిని ఓటు బ్యాంకుగా చూసుకుంటున్నాయే తప్ప వారి అభ్యున్నతికి పాటుపడిన దాఖలాలు లేవు. దశాబ్దాలుగా రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నా కనికరించడం లేదు. ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంటున్నారు. ముఖ్యంగా జగన్ సర్కారు తమను నమ్మించి అన్నివిధాలా దగా చేసిందని కాపులు మండిపడుతున్నారు. కాపు సంక్షేమాన్ని కాగితాలకే పరిమితం చేసింది. పథకాల్లో భారీగా కోత విధించింది. ఒక్క కాపు నేస్తం తప్పించి మిగతా పథకాలన్నింటినీ రద్దు చేసింది. విద్యోన్నతి, విదేశీ విద్య పథకాలకు మంగళం పలికింది. జగన్ విపక్షంలో ఉన్నప్పుడు కాపులపై ఎనలేని ప్రేమను కనబరిచారు. అధికారంలోకి వస్తే కాపుల బతుకులనే మార్చుతానని హామీ ఇచ్చారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఏటా రూ.2 వేల కోట్లు కేటాయిస్తానని చెప్పుకొచ్చారు. తద్వారా ఐదేళ్లలో రూ.10 వేల కోట్లతో వారి ఆర్థిక స్థితిగతులను మార్చుతానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత రూటు మార్చారు. అప్పటివరకూ చంద్రబాబు సర్కారు అందించిన పథకాలను సైతం రద్దుచేశారు. కాపు కార్పొరేషన్ అయితే ఏర్పాటుచేశారు కానీ.. వాటికి నిధులు, విధులు లేకుండా చేశారు.

Kapu Welfare
Y S Jagan

నాటి పథకాలేవీ?

టీడీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్ కు ఏటా రూ.700 కోట్లు కేటాయించేది. దీంతో విద్యోన్నతి, విదేశీ విద్య, స్వయం ఉపాధి పథకాలు వంటివి కార్పొరేషన్ ద్వారా అమలుచేసేవారు. కాపు నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఇవి ఎంతగానో ప్రయోజనకారిగా నిలిచేవి. ప్రధానంగా స్వయం ఉపాధి పథకాలకే ఏటా రూ.300 కోట్లు వరకూ ఖర్చుచేసేవారు. ఇవి ఎంతగానో సత్ఫలితాలనిచ్చినట్టు ఇప్పటికీ కాపు సామాజికవర్గీయులు చెబుతుంటారు. పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్, కాపు సామాజికవర్గ భవనాలు వంటి వాటిని నిర్మించారు. కానీ జగన్ సర్కారు వచ్చాక వీటన్నింటికీ కోత విధించింది. కేవలం 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న వారికి కాపునేస్తం మినహాయించి ఏ ఒక్క పథకం ఇప్పుడు నిలబడలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక పద్ధతి ప్రకారం కాపు కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారు. తన రాజకీయ లబ్ధికి ఇబ్బడిముబ్బడిగా జగన్ వివిధ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటుచేశారు. కార్యవర్గాలను నియమించారు. అయితే ఏ ఒక్క కార్పొరేషన్ కు విధులు, నిధులు లేవు. ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయి. వాటిలో కాపు కార్పొరేషన్ కూడా ఉండిపోయింది. ఏటా రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పిన జగన్ రూపాయి విదిల్చడం లేదు. దీంతో కార్పొరేషన్ పాలకవర్గం ఈగలు తోలుకుంటుందన్న విమర్శ అయితే మూట గట్టుకుంది.

Also Read: Radhika Apte Viral Comments: పొడుగ్గా ఉంటే నచ్చదట.. భర్తపై రాధిక ఆప్టే కామెంట్స్ వైరల్

ఇచ్చింది గోరంత…

అయితే లెక్కల గారడీలో మాత్రం జగన్ సర్కారు ముందుంది. ఒక్కో కుటుంబానికి రూ.15 వేలు సాయమందించి.. లక్షల్లో అందిస్తున్నట్టు ఆర్భాటంగా ప్రకటించుకుంటోంది. సాక్షి మీడియాలో పతాక శీర్షికన కథనాలు వండి వార్చుతోంది. అటు ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోంది. నవరత్నాల రూపంలో అందించే అమ్మ ఒడి, రైతుభరోసా ఇలా అన్ని పథకాలను చేర్చి వేల కోట్ల రూపాయలు కాపులకు ఖర్చు పెడుతున్నట్టు జగన్ ప్రభుత్వం మభ్యపెడుతోంది. అటు రిజర్వేషన్లలో సైతం కాపులకు తీరని అన్యాయం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కింద చంద్రబాబు సర్కారు ప్రకటించిన 5 శాతం రిజర్వేషన్లను సైతం రద్దుచేసి కాపులపై ఉన్న తన అక్కసును జగన్ వెళ్లగక్కారు.

కార్పొరేషన్ నిర్వీర్యం..

కాపు కార్పొరేషన్ ను ప్రభుత్వం పరిగణిస్తున్న తీరు విస్మయం గొల్పుతోంది. రూ.2 వేల కోట్ల కేటాయింపుతో కాపు కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్ల కంటే అగ్రగామిగా నిలుపుతామని వైసీపీ పాలక పెద్దలు చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారులను నియమిస్తున్నారు. అయితే ఈ నియామకమే విస్తు గొల్పుతోంది. కేవలం పనిష్మంట్ అధికారులనే నియమిస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి కూడా గతంలోగా పోటీ లేదు. ఏటా రూ.2 వేలు కేటాయిస్తామన్న ప్రకటనతో విపరీతమైన పోటీ నెలకొంది. తొలుత రాజానగరం ఎమ్మెల్యే రాజా పదవిని చేపట్టారు. ప్రస్తుతం విజయవాడకు చెందిన అడపా శేషు ఉన్నారు. అయితే కార్పొరేషన్ పదవి ఉత్సవవిగ్రహమే తప్పించి నిధులు, విధులు లేవని కాపు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Ravi Teja Rama Rao On Duty: రవితేజకు షాక్, ఆ సీన్స్ లీక్.. టెన్షన్ లో రామారావు టీమ్ !

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version