తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ఏపీ పోలీసుల సోదాలు!

ఏపీ కంటే తెలంగాణలో మద్యం రేట్లు చాలా తక్కువ. ఏపీలో కొన్ని బ్రాండ్లపై నిషేధం ఉండగా తెలంగాణలో అన్నిరకాల బ్రాండ్లు లభ్యమవుతున్నాయి. దీంతో ఏపీ నుంచి మద్యంబాబులు తెలంగాణ సరిహద్దు గ్రామాలకు తరలివస్తున్నారు. కొందరు ఈ ప్రాంతాల్లో మద్యం సేవించి వెళ్తుండగా మరికొందరు ఇదే అదునుగా భావించి భారీ ఎత్తున మద్యాన్ని ఏపీకి తరలిస్తున్నారు. మద్యం అమ్మకాలపై ఏపీలో ఆంక్షలు ఉండటం.. తెలంగాణ నుంచి భారీ ఎత్తున ఏపీలోకి మద్యం వస్తుండటంతో ఏపీ పోలీసులు దీనిపై దృష్టిసారించారు. […]

Written By: Neelambaram, Updated On : June 15, 2020 12:13 pm
Follow us on


ఏపీ కంటే తెలంగాణలో మద్యం రేట్లు చాలా తక్కువ. ఏపీలో కొన్ని బ్రాండ్లపై నిషేధం ఉండగా తెలంగాణలో అన్నిరకాల బ్రాండ్లు లభ్యమవుతున్నాయి. దీంతో ఏపీ నుంచి మద్యంబాబులు తెలంగాణ సరిహద్దు గ్రామాలకు తరలివస్తున్నారు. కొందరు ఈ ప్రాంతాల్లో మద్యం సేవించి వెళ్తుండగా మరికొందరు ఇదే అదునుగా భావించి భారీ ఎత్తున మద్యాన్ని ఏపీకి తరలిస్తున్నారు. మద్యం అమ్మకాలపై ఏపీలో ఆంక్షలు ఉండటం.. తెలంగాణ నుంచి భారీ ఎత్తున ఏపీలోకి మద్యం వస్తుండటంతో ఏపీ పోలీసులు దీనిపై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులకు సమాచారం అందించకుండా సరిహద్దు గ్రామాల్లో ఏపీ పోలీసులు సోదా చేపట్టడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీకి కూతవేటులోనే జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రామం ఉంది. కర్నూలుకు చేరువలో ఉండే ఈ గ్రామంలో మద్యం విక్రయిస్తున్నారనే కారణంతో ఏపీకి చెందిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం సోదాలు చేపట్టింది. వీరిని తెలంగాణ పోలీసులుగా స్థానికులు భావించి తొలుత సహకరించారు. ఆ తర్వాత ఏపీ పోలీసులుగా గుర్తించిన ప్రజలు ఏపీ పోలీసుల జీపును చుట్టుముట్టి తెలంగాణ పోలీసులకు సమాచారం అందించారు.

తెలంగాణ పోలీసులు వీరిని ప్రశ్నింగా పొంతనలేని సమాధానం చెప్పారు. ఈ గ్రామంలోని లిక్కర్ షాపులకు నోటీసులు ఇవ్వడానికి వచ్చామని ఒకసారి.. ఈ ప్రాంతంలో నేరస్థులు దాక్కున్నారని మరోసారి సమాధానం చెప్పారు. దీనిపై తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పొరుగు రాష్ట్ర పోలీసులు ఎలా వస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో సోదాలు చేసేందుకు ఏపీ పోలీసులకు అధికారం లేకున్నప్పటికీ ఇలా చేయడంపై స్థానకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారుల నుంచి తెలంగాణ పోలీసులు వివరణ కోరినట్లు తెలుస్తోంది.