spot_img
Homeఆంధ్రప్రదేశ్‌ఏపీ మంత్రివర్గ విస్తరణపై మల్లగుళ్లాలు

ఏపీ మంత్రివర్గ విస్తరణపై మల్లగుళ్లాలు

CM Jagan

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఎవరి అంచనాల్లో వారు తలమునకలవుతున్నారు. ఆశావహుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. కేబినెట్ లో ఎవరుంటారో? ఎవరు వెళతారో తెలయడం లేదు. దీంో రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఏ సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తారో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. జిల్లాల వారీగా సామాజిక వర్గీకరణ దృష్ట్యా ఎవరికి బెర్త్ లు ఖాయమవుతాయోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మొత్తానికి మంత్రివర్గ విస్తరణ జగన్ కు ఓ పెద్ద సవాల్ గానే భావిస్తున్నారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారనే ప్రచారం ఉన్నా సామాజిక వర్గాలకే మొగ్గు చూపుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన గుమ్మనూరు జయరాంకు పదవి దక్కింది. పార్టీ ప్రక్షాళనలో భాగంగా కర్నూలు జిల్లాలో జగన్ కు తలనొప్పులు తప్పేలా లేవు.

జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రుల్లో ఒకరిని కొనసాగిస్తూ మరొకరిని తప్పించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. బుగ్గన కంటిన్యూ అవుతారనే తెలుస్తోంది. బీసీ మంత్రిగా ఉన్న జయరాంను తప్పిస్తే మరో బీసీ ఎమ్మెల్యే లేరు. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం దక్కుతుందో లేదో చూడాల్సిందే. ఎస్సీల్లో తొగురు ఆర్థర్, డాక్టర్ సుధాకర్ ఉన్నారు. కానీ వీరికి మంత్రి పదవి దక్కే సూచనలు కనిపించడం లేదు. దీంతో మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికే పదవి దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మంత్రాలయంలో సీనియర్ నాయకుడు బాల నాగిరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వంటి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ ముగ్గురు కూడా సీనియర్లే కావడంతో ఎవరికి మంత్రి పదవి వస్తుందోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాయిప్రసాద్ రెడ్డి రెండుసార్లు, బాల నాగిరెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిద్దరు సోరదులే కావడంతో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందోనని చూస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో పార్టీలో చేరిన సమయంలోనే ఎమ్మెల్సీ పదవి వదులుకోవడంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం సాగుతోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version