https://oktelugu.com/

ఏపీలో 161కి పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 161కి పెరిగింది. వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గురువారం రాత్రి పది గంటల అనంతరం 18 కొత్త కేసులు నమోదైనట్లు స్టేట్ కరోనా నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలో 20, నెల్లూరు జిల్లాలో 32, ప్రకాశం జిల్లాలో 17, కడప జిల్లాలో 19, కృష్ణా జిల్లాలో 23, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, విశాఖపట్నం […]

Written By: , Updated On : April 3, 2020 / 12:38 PM IST
Follow us on


ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 161కి పెరిగింది. వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గురువారం రాత్రి పది గంటల అనంతరం 18 కొత్త కేసులు నమోదైనట్లు స్టేట్ కరోనా నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలో 20, నెల్లూరు జిల్లాలో 32, ప్రకాశం జిల్లాలో 17, కడప జిల్లాలో 19, కృష్ణా జిల్లాలో 23, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, విశాఖపట్నం జిల్లాలో 14, తూర్పుగోదావరి జిల్లాలో 9, చిత్తూరు జిల్లాలో 9, అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 1 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో శుక్రవారం నాటికి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు అయిన జిల్లాగా నెల్లూరు జిల్లా ఉంది. నిన్నటి వరకూ ఈ స్థానంలో కృష్ణా జిల్లా ఉంది.