spot_img
Homeఆంధ్రప్రదేశ్‌జగన్ మరో సంచలనం.. అంతా షేక్ అవుతున్నారా?

జగన్ మరో సంచలనం.. అంతా షేక్ అవుతున్నారా?

CM Jagan

అవినీతి కేసులో ఆరోపణలతో దాదాపు 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన జగన్ పై ఇంకా ఆ మరక పోలేదు. కోర్టులో విచారణ జరుగుతోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఆయన మెడకు ఉంది.ఈ క్రమంలోనే సీఎం జగన్ గద్దెనెక్కితే రాష్ట్రాన్ని దోచుకుంటారని ప్రతిపక్ష చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఎన్నికల ముందర చేయని దుష్ప్రచారం లేదు.

Also Read: బాబు… నీకు రమేష్ లు తెలుసా…? మీ రిలేషన్ ఏమిటి అసలు?

కానీ జగన్ గద్దెనెక్కగానే తనపై పడిన ఈ మకిలిని పూర్తిగా దూరం చేసుకునేందుకు సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఒక జడ్జిని నియమించి టెండర్లను ‘రివర్స్ టెండరింగ్’ ద్వారా చేయిస్తూ ప్రభుత్వానికి డబ్బును మిగులుస్తున్నారు. హైకోర్టు జడ్జి ద్వారానే టెండర్లను ఆమోదింప చేసుకుంటూ పారదర్శకతకు పెద్దపీట వేశారు.

ఇక ఈ క్రమంలోనే ఏపీలో అవినీతిపై ఇప్పుడు జగన్ బ్రహ్మాస్త్రం సంధిస్తున్నారు. జగన్ చేస్తున్న ఈ ప్లాన్ కు ఇప్పుడు అధికారులు వణికిపోతున్నారు. అది అమలైతే ఇక ఏపీలో అవినీతి చేయాలంటే భయపడే రోజులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

అవినీతి నిరోధం, ప్రభుత్వ చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ డీజీపీ ఆంజనేయులు, ఉన్నతాధికారులు, ఐఐఎం అహ్మదాబాద్ ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించారు.

ముఖ్యంగా కోట్లు వ్యయం అయ్యే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రభుత్వంలోని ప్రతీ విభాగంలోనూ రివర్స్ టెండరింగ్ చేయాలని.. టెండర్ విలువ కోటి రూపాయలు దాటితే రివర్స్ టెండరింగ్ కు వెళ్లాల్సిందేనని తేల్చారు. అవినీతిపై త్వరలోనే చట్టం తీసుకురానున్నట్టు తెలిసింది.

Also Read: ఎమ్మెల్యే వంశీకి గట్టి కౌంటర్ ఇచ్చిన దుట్టా..!

ఏపీలో ఇకపై లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికితే నిర్ధిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలని జగన్ సంచలన నిర్ణయించారు. ‘దిశ’ తరహాలోనే అసెంబ్లీలో దీనిపై బిల్లు పెట్టే దిశగా జగన్ ఆలోచన చేస్తున్నారు. ఇందుకోసం ఏసీబీకి 14400 నంబర్ ను రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టి గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు అనుసంధానం చేయనున్నారు.

ఈ చట్టం చేస్తే ఏపీలో అధికారులు లంచాలు తీసుకొని తప్పించుకోవడానికి ఉండదు. జగన్ సర్కార్ కనుక బిల్లు పెట్టి పాస్ చేయిస్తే ఏపీలో అవినీతికి చెక్ పడుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

-ఎన్నం

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper
Exit mobile version