
తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభన నేపథ్యంలో లాక్ డౌన్ ని అమలుపరుస్తున్నారు. దింతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో నిత్యావసర సరుకుల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఇద్దరు సీఎం లు ఉచిత రేషన్ ని ప్రజలకు అందిస్తున్నారు. అయితే ఈ విషయంలో తెలంగాణ సీఎం తో పోలిస్తే ఏపీ సీఎం జగన్ ముందంజలో ఉన్నారు. లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత జగన్ రెండు సార్లు ఉచిత రేషన్ ఇచ్చి ఇప్పుడు మూడోసారి కూడా ఇవ్వడానికి సిద్ధమౌతున్నారు.కానీ సీఎం కేసీఆర్ ఈ విషయంలో వెనుకపడ్డారు. ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే రేషన్ ఇచ్చారు.
అంతేకాకుండా ఒక్కో రేషన్ కార్డ్ పై 12 కేజీల బియ్యం మాత్రమే కేసీఆర్ సర్కార్ అందిస్తుంది. కానీ జగన్ సర్కార్ అందుకు భిన్నంగా రేషన్ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యంతోపాటు ప్రతి కార్డుకు కిలో కందిపప్పును ఉచితంగా అందిస్తున్నారు.
ప్రతి కుటుంబానికి రు.1500 ఇస్తా అని కేసీఆర్ మాట. ఇచ్చారు. కానీ అందరికి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కూడా లాక్ డౌన్ లో ప్రజలకు ఇచ్చిన హామీలు బియ్యం, కంది పప్పు, వంటి నిత్యావసర వస్తువులు, రూ.1000 ఆర్థిక సహాయం చేశారు. సీఎం కెసిఆర్ మాత్రం ఇచ్చిన మాటను నెరవేర్చడంలో విఫలమయ్యారు. అంతేకాకుండా పేద ప్రజలకు కనీసం నిత్యావసర సరుకులు పంపిణీ. చేసే విషయంలో కేసీఆర్ కంటే జగన్ ముందజలో ఉన్నారు.