గత కొన్ని రోజుల పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ పై తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న అంశంపై ఏపీ సీం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. 881 అడుగులు ఉన్నప్పుడే 44 వేల క్యూసెక్కులు తీసుకోగలమని ఆయన తెలిపారు. 854 అడుగుల్లో ఉంటే కేవలం 7వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలమని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ కరువు ఎలా తీర్చాలి ? అని ఆయన వ్యాఖ్యానించారు. 800 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు తెలంగాణ నీళ్లు తీసుకెళ్తోందని సీఎం జగన్… అదే 800 అడుగుల వద్ద మాకు కేటాయించిన నీళ్లను తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలా తీసుకోవడం వల్ల ఎవరికీ నష్టం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడే రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మన పాలన–మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయం, అనుబంధ రంగాలపై జరిగిన సమీక్షలో ఏపీ సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.