ఫైట్ కు రె‘ఢీ’ అవుతున్న జగన్, చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళైంది. శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. కరోనా కల్లోలంలో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిన వేళ.. సమస్యలు చుట్టుముట్టిన తరుణంలో అధికార వైసీపీ ఈసారి అసెంబ్లీ సమావేశాలను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది. ఈసారి అసెంబ్లీని 3 రాజధానుల అంశం, స్థానిక సంస్థల ఎన్నికలు, అంతర్వేది ఘటన లాంటి అంశాలు కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో వాడివేడిగా వాగ్వాదం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. Also Read: జగన్ కు కేంద్రం షాక్: దోస్తీ […]

Written By: NARESH, Updated On : November 27, 2020 10:50 am
Follow us on

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళైంది. శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. కరోనా కల్లోలంలో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిన వేళ.. సమస్యలు చుట్టుముట్టిన తరుణంలో అధికార వైసీపీ ఈసారి అసెంబ్లీ సమావేశాలను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది. ఈసారి అసెంబ్లీని 3 రాజధానుల అంశం, స్థానిక సంస్థల ఎన్నికలు, అంతర్వేది ఘటన లాంటి అంశాలు కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో వాడివేడిగా వాగ్వాదం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Also Read: జగన్ కు కేంద్రం షాక్: దోస్తీ అంటూనే ఫుట్ బాల్ ఆడేస్తున్నారు

ఈనెల 30వ తేది సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. డిసెంబర్ 5 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు గవర్నర్ పేరిట నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నిరోజులు జరపాలనే అంశాన్ని సోమవారం జరుగనున్న బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు.ఈసారి శీతాకాల సమావేశాల్లో 11 చట్టాల్లో సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక 3 కీలక బిల్లులు ఆమోదించుకోవాలని చూస్తోంది.

ఇక కరోనా వేళ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయనే అంశాన్ని టీడీపీ భుజానికెత్తుకుంది. ఆ అంశాన్ని కూడా పార్టీ సభలో ప్రస్తావించి చర్చకు పట్టుబడట్టే అవకాశాలున్నాయి. అయితే కరోనా కారణంగా అసెంబ్లీ పనిదినాలను తగ్గించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

Also Read: జగన్ అక్రమ ఆస్తుల కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసారి అసెంబ్లీ హోరెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తరుఫున మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ అంశంపై చర్చకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్