హుజురాబాద్ లో ఈటలకు మరో షాక్.. అంతా టీఆర్ఎస్ లోకి..

హుజురాబాద్ ఉప ఎన్నిక విచిత్ర మలుపులు తిరుగుతోంది. రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అధికార పార్టీ ఆటలో అందరూ పావులుగా మారుతున్నారు. ధన ప్రవాహంతో చిన్నపాటి నాయకులను తమ దారికి తెచ్చుకుంటూ తన పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. ప్రలోభాలకు లొంగుతూ ఒక్కొక్కరుగా నేతలు ఈటలను బాటను వీడుతూ వారిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులను పార్టీ మారేలా చేస్తూ బీజేపీకి సవాలు విసురుతున్నారు. దీంతో బీజేపీ సైతం తనదైన శైలిలో సమాధానం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. […]

Written By: Srinivas, Updated On : July 28, 2021 10:56 am
Follow us on

హుజురాబాద్ ఉప ఎన్నిక విచిత్ర మలుపులు తిరుగుతోంది. రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అధికార పార్టీ ఆటలో అందరూ పావులుగా మారుతున్నారు. ధన ప్రవాహంతో చిన్నపాటి నాయకులను తమ దారికి తెచ్చుకుంటూ తన పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. ప్రలోభాలకు లొంగుతూ ఒక్కొక్కరుగా నేతలు ఈటలను బాటను వీడుతూ వారిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులను పార్టీ మారేలా చేస్తూ బీజేపీకి సవాలు విసురుతున్నారు. దీంతో బీజేపీ సైతం తనదైన శైలిలో సమాధానం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ప్రజాదీవెన యాత్రతో నియోజవకర్గంలో పర్యటిస్తూ ఆశీర్వదించాలని ఈటల రాజేందర్ కోరుతున్నారు. అధికార పార్టీ ధన దాహానికి బలి కావద్దని సూచిస్తూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ధన ప్రవాహానికి మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దని సూచిస్తున్నారు. ఎక్కడలేని ప్రేమ సీఎం హుజురాబాద్ పై ఒలకబోస్తున్నారని చెబుతున్నారు. ఎన్ని వాగ్దానాలు చేసినా చివరికి మనదే విజయం అనే దీమాలో ఈటల ఉన్నారు.

ఈటల రాజేందర్ ముఖ్య అనుచరుల్లో దేశిని కోటిని తమ పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్న కోటి భార్య దేశిని స్వప్న కూడా తాను పార్టీ వీడుతున్నట్లు చెప్పడం కొసమరుపు. ఈటల ప్రధాన అనుచరుల్లో ఒకరైన బండా శ్రీనివాస్ కు కూడా పార్టీ వీడేందుకు సిద్ధపడినట్లు సమాచారం. దీంతో బీజేపీని అభాసుపాలు చేసి తమ పంతం నెగ్గించుకోవాలని చూస్తున్న అధికార పార్టీ కుట్రలకు కిందిస్థాయినేతలు బలవుతున్నట్లు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ వేసిన ఉచ్చులో చిక్కుకుంటున్న నేతలను కాపాడే ప్రయత్నంలో బీజేపీ కూడా ఆలోచనలు చేస్తోంది. నేతలు పార్టీని వీడకుండా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇలా వరుస కట్టి నేతలు పార్టీకి గుడ్ బై చెబితే భవిష్యత్తు కష్టంగా మారే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. అందుకే నేతలను తమ దారి వదలకుండా ఉండేలా చేయడానికి వారిని మానసికంగా సంసిద్ధులను చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. హుజురాబాద్ ఉప ఎన్నికలో అపజయం భయంతోనే అధికార పార్టీ దుర్మార్గాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది.