spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Liquor: ఏపీలో మద్యం తాగితే చావులే.. ఆసుపత్రుల్లో సగం రోగులు వారే

AP Liquor: ఏపీలో మద్యం తాగితే చావులే.. ఆసుపత్రుల్లో సగం రోగులు వారే

AP Liquor: ఏపీలో మద్యం మరణాలు వెలుగుచూస్తున్నాయి. మద్యం అలవాటుతో అవయవాలు పాడైపోయి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీనికి జగన్ సర్కార్ చర్యలే కారణమని విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించింది. నేరుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడుపుతూ వస్తోంది. ఎప్పుడు వినని బ్రాండ్లు, చూడని మద్యం సీసాలు ఏపీలో కనిపిస్తున్నాయి. జే బ్రాండ్ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తుండగా.. గత ప్రభుత్వం అనుమతించిన కంపెనీలే నుంటూ జగన్ దుబాయిస్తూ వస్తున్నారు.

ఇటువంటి తరుణంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మద్యం విధానంపై పోరాడడం ప్రారంభించారు. రాష్ట్రంలో మద్యం ద్వారా 25 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడిప్పుడే ఈ మద్యం విషయంలో జరుగుతున్న దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల పురందేశ్వరి నరసాపురంలో ఓ మద్యం దుకాణానికి వెళ్లి క్రయవిక్రయాలపై ఆరా తీశారు. అవినీతిని బయటపెట్టారు. నేరుగా ఆసుపత్రికి వెళ్లి రోగులను పరామర్శించారు. మద్యం తాగడం వల్లే అనారోగ్యానికి గురయ్యారన్న మెడికల్ రిపోర్టులను పరిశీలించారు. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఆరా తీయగా.. సగం రుగ్మతలకు ఏపీలో సరఫరా అవుతున్న మద్యమే కారణమని తేలింది.

ఏపీలో కనిపించే మద్యం దేశంలో ఎక్కడా కనిపించదు. కనీస పరీక్షలు కూడా చేయనమద్యాన్ని అడ్డగోలుగా తయారుచేసి.. చిత్ర విచిత్రమైన బ్రాండ్ల పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలోనే సొంత చీఫ్ లిక్కర్ బ్రాండ్ వైసీపీ అభ్యర్థులు రాష్ట్రమంతా దొంగతనంగా పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో కేసులు కూడా నమోదు అయ్యాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి మద్యం అధికారిక వైన్ గా మారిపోయింది.అది నాణ్యతలేని మద్యం అని తెలుగుదేశం పార్టీ నేతలు లేబుల్లోనే పరిశీలించారు. నకిలీ మద్యంగా నిర్ధారించారు. టిడిపి నేతలు ఏ స్థాయిలో ఆరోపణలు చేసినా.. వ్యాపారానికి అలవాటు పడిపోయిన వైసీపీ నేతలు, ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ఇప్పటికైనా కేంద్రం దిగివస్తే మద్యం కుంభకోణం తో పాటు ఈ మద్యం మరణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు విస్తృతమైన సర్వే, పరిశీలన చేస్తే కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Oktelugu Epaper
Exit mobile version