spot_img
Homeజాతీయ వార్తలుED IT Raids And SIT: ఎడా పెడా కేసులు.. దర్యాప్తు సంస్థలు దారితప్పుతున్నాయా?

ED IT Raids And SIT: ఎడా పెడా కేసులు.. దర్యాప్తు సంస్థలు దారితప్పుతున్నాయా?

ED IT Raids And SIT: తెలంగాణలో ఆధిపత్య రాజకీయ, ప్రతీకార చర్యలు చూస్తుంటే ఈ పరిణామాలు ఎక్కడి వరకు వెళ్తాయో.. ఎవరి కొంప ముగునుగుతుందో అన్న ఆందోళన అటు టీఆర్‌ఎస్‌.. ఇటు బీజే పీ నేతల్లో వ్యక్తమవుతోంది. మంత్రి గంగుల కమలాకర్‌పై ఈడీ దాడులు, క్యాసినో కేసులో మంత్రి తలసాని సోదరులు, మంత్రి పీఏ హరీశ్‌ విచారణ, తాజాగా మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు, మరోవైపు లిక్కర్‌ స్కాం దర్యాప్తు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌. సంతోష్‌కు సిట్‌ నోటీసులు, బీజేపీ నాయకులకు నోటీసులు, మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై వాణిజ్య పన్నుల శాఖ దాడులు.. కేసులతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

ED IT Raids And SIT
ED IT Raids And SIT

దర్యాప్తు సంస్థల దుర్వినియోగం..
కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు నమోదు చేస్తున్న కేసుల్లో నేరం ఉందో లేదో ఎవరికీ తెలియదు. దోషులు ఎవరు.. నిర్దోషులు ఎవరు అనేది దర్యాప్తు సంస్థలే నిర్ణయించాలి. కానీ తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దర్యాప్తు సంస్థలతో ప్రతీకార దాడులు జరుగుతున్నాయన్నది మాత్రం వాస్తవం. ఎన్ని కేసులు నమోదైనా కొన్నేళ్ల తర్వాత అవన్నీ వీగిపోతాయి. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా అనేక కేసులు నమోదయ్యాయి. కానీ అవన్నీ ఇప్పుడు మనుగడలో లేవు. తాజాగా బీజేపీ దర్యాప్తు సంస్థల దాడులు పెంచింది. దీంతో తామేమీ తక్కువ అన్నట్లు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తన దర్యాప్తు సంస్థలతో జాతీయ నేతలపైనే గురిపెట్టింది. ఈ పరిణామాలు చూస్తుంటే దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్షసాధింపు కోసం దుర్వినియోగం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ED IT Raids And SIT
ED IT Raids And SIT

బ్లాక్‌మెయిల్‌ కోసం..
తాజాగా పరిణామాలను చూస్తుంటే… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధిపత్యం కోసం దర్యాప్తు సంస్థలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమని తెలుస్తోంది. ఇలాంటి చర్యలతో దర్యాప్తు సంస్థలు కూడా క్రెడిబులిటీ కోల్పోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తవుతోంది. ప్రజల విశ్వాసం కోల్పోతో దర్యావ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు ఎప్పటికీ మంచిది కాదని పేర్కొంటున్నారు. దర్యాప్తు సంస్థలే దారి తప్పితే.. రాబోయే రోజుల్లో పూర్తిగా కక్షసాధింపు కోసమే వాడుకునే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version