టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్

అప్పుడెప్పుడో డ్రగ్స్‌ కేసు టాలీవుడ్‌ను ఊపేసింది. డ్రగ్స్‌తో లింక్‌లు ఉన్న వారందరినీ సీబీఐ అధికారులు విచారించారు. ఈ సమయంలో ఈ వార్త ప్రకంపనలు సృష్టించింది. కొద్ది రోజుల పాటు హాట్‌హాట్‌గా నడిచిన ఈ విచారణ.. తర్వాత ఏమైందో కానీ మరుగునపడిపోయింది. అయితే.. ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయట. Also Read: కాజల్ నో సీక్రెట్స్.. హనీమూన్ తో సహా అన్నీ చూపిస్తోంది? అంతే కాదు.. ఆ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల వద్దకు చేరే […]

Written By: NARESH, Updated On : November 13, 2020 11:42 am
Follow us on

Tollywood drug case

అప్పుడెప్పుడో డ్రగ్స్‌ కేసు టాలీవుడ్‌ను ఊపేసింది. డ్రగ్స్‌తో లింక్‌లు ఉన్న వారందరినీ సీబీఐ అధికారులు విచారించారు. ఈ సమయంలో ఈ వార్త ప్రకంపనలు సృష్టించింది. కొద్ది రోజుల పాటు హాట్‌హాట్‌గా నడిచిన ఈ విచారణ.. తర్వాత ఏమైందో కానీ మరుగునపడిపోయింది. అయితే.. ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయట.

Also Read: కాజల్ నో సీక్రెట్స్.. హనీమూన్ తో సహా అన్నీ చూపిస్తోంది?

అంతే కాదు.. ఆ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల వద్దకు చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డ్రగ్స్ కేసు ఎటూ తేలడం లేదని.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే అది ఇప్పుడు వేసింది కాదు.. 2017లోనే డ్రగ్స్ కేసు ఫుల్ స్వింగ్‌లో ఉన్నప్పుడే వేశారు. ఈ పిటిషన్‌పై తాజా విచారణలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్‌ కేసులో సిట్‌ దర్యాప్తు నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రేవంత్‌ పిటిషన్‌ వేసిన సమయంలో.. కేసులో అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉందని చెప్పారు. ఈ కేసు విచారణకు వేసిన ఎక్సైజ్‌ సిట్‌ పరిధి సరిపోదని సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీ సంస్థలకు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. దర్యాప్తునకు ఈడీ, ఎన్‌సీబీ సిద్ధంగా ఉన్నాయని.. రేవంత్ తరపు న్యాయవాది తాజాగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిట్‌ తాజా పరిస్థితి, దర్యాప్తు నివేదికపై డిసెంబర్‌ 10లోపు తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కేసు విషయంపై హైకోర్టు ఏదో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Also Read: చిరంజీవి కరోనా అప్ డేట్.. ఏమైందంటే?

ఇప్పటికే ముంబైలో డ్రగ్స్ కేసు విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారిస్తోంది. కర్ణాటకలోనూ సినీ పరిశ్రమకు సంబంధం ఉన్న భారీ రాకెట్‌పైనా విచారణ జరుగుతోంది. ఈ సమయంలో హైదరాబాద్ డ్రగ్స్ కేసు కూడా ఎన్‌సీబీ చేతికి వెళ్తే ముంబై, బెంగళూరు తరహాలో ఇక్కడా సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్