spot_img
Homeఆంధ్రప్రదేశ్‌LV Subrahmanyam: ఏపీలో కొత్త పార్టీ.. ముందుండి నడిపిస్తున్న ఆ కీలక మాజీ అధికారి

LV Subrahmanyam: ఏపీలో కొత్త పార్టీ.. ముందుండి నడిపిస్తున్న ఆ కీలక మాజీ అధికారి

LV Subrahmanyam: ఏపీ ప్రభుత్వ మాజీ సిఎస్ ఎల్ వి సుబ్రహ్మణ్యం జగన్ సర్కార్ పై యుద్ధం ప్రకటించారు. ఏపీలో విశ్రాంత ఉద్యోగులు విషయంలో సర్కార్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా పోరాటానికి సిద్ధపడ్డారు. 2019 ఎన్నికల నాటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వి సుబ్రహ్మణ్యం ఉండేవారు. కానీ జగన్ కు ఆయన కొనసాగింపు ఇచ్చారు. ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. సుబ్రహ్మణ్యం సైతం సీఎం జగన్ అంటే ఎనలేని అభిమానంతో ఉండేవారు. అయితే వారి మధ్య ఎక్కడ తేడా కొట్టిందో కానీ పదవి విరమణకు ముందు అప్రాధాన్య పోస్టులోకి పంపించారు. దీంతో అవమానంగా భావించిన ఎల్.వి చివరి వరకు సెలవు పెట్టి పదవీ విరమణ చేశారు.

ఇప్పుడు అదే ఎల్వి సుబ్రహ్మణ్యం జగన్ సర్కార్కు కొరకరాని కొయ్యగా మారారు. ఏకంగా పెన్షనర్లతో ఓ పార్టీ పెట్టించి పోరాటానికి దిగడం విశేషం. టిడిపి ప్రభుత్వ హయాంలో ఐవైఆర్ కృష్ణారావు ఒక వెలుగు వెలిగారు. ఆయన సీఎస్ గా పని చేశారు. పదవీ విరమణ తర్వాత చంద్రబాబు ఆయన్ను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. కానీ 2019 ఎన్నికలకు ముందు టిడిపికి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. జగన్కు రాజకీయ లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు. 2019 ఎన్నికల తర్వాత ఐ వై ఆర్ కృష్ణారావు బిజెపిలో చేరారు. అయితే గతం మాదిరిగా జగన్ సర్కార్ పై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు కానీ.. కొన్ని రకాలుగా విమర్శనాస్త్రాలు సంధించారు. వైఫల్యాలను అండగట్టారు. సరిగ్గా ఐవైఆర్ మాదిరిగానే ఎల్వి సుబ్రహ్మణ్యం ఇప్పుడు జగన్ సర్కారును ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారు.

ప్రతి నెల పెన్షనర్లు పింఛన్ కోసం ఎదురుచూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏపీలో ఉంది. మూడో వారం దాటితే కానీ పెన్షన్ దొరకని పరిస్థితి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ ఏర్పాటుచేసి కొంతమంది పోరాడుతున్నారు. దీనికి ముందుండి నడిపించేందుకు ఎల్వి సుబ్రహ్మణ్యం ముందుకు రావడం విశేషం. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో పెన్షనర్ల హక్కుల కోసం రాజకీయ పార్టీ పెట్టి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఎల్.వి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగం అమలు చేసే వ్యక్తులు సరైన వాళ్ళు అయితే అందరి హక్కులకు రక్షణ ఉంటుందని చెప్పారు. వ్యవస్థలు సక్రమంగా నడిచినప్పుడు వ్యక్తుల స్వాతంత్రం కాపాడ పడుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం పెన్షనర్లను దారుణంగా వంచిస్తుందన్నారు. దీనికి మూల్యం తప్పదని హెచ్చరించారు. మొత్తానికైతే ఎన్నికల ముంగిట మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం బయటకు వచ్చి జగన్ సర్కార్ పై పోరాడుతుండడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...
Oktelugu Epaper