Maha Kumbh Mela 2025 (2)
Mahakumbh 2025: 2025 ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో జార్ఖండ్కు చెందిన ఒక కుటుంబంలో ఒక అద్భుతం జరిగింది. 27 సంవత్సరాల క్రితం తప్పిపోయిన తమ బంధువును ప్రయాగ్రాజ్ కుంభమేళాలో కనుగొన్నట్లు ఓ కుటుంబసభ్యులు పేర్కొన్నారు. తప్పిపోయిన వ్యక్తి గంగాసాగర్ యాదవ్ గా వారు గుర్తించారు. తను ప్రస్తుతం కుంభమేళాలో 65 ఏళ్ల అఘోరి రాజ్కుమార్గా ప్రత్యక్షం అయ్యాడు. 1998లో పాట్నాకు వెళ్లిన తర్వాత గంగాసాగర్ కనిపించకుండా పోయాడు. దీంతో అతని భార్య ధన్వ దేవి వారి ఇద్దరు కుమారులు కమలేష్, విమలేష్ లను కష్టపడి పెంచింది. గంగాసాగర్ తమ్ముడు మురళీ యాదవ్ తన సోదరుడి కోసం వెతికి వెతికి ఆశలు వదులు కున్నాడు. కొందరు కుంభమేళాకు వెళ్లగా.. అక్కడ తమకు తెలిసిన గంగాసాగర్ లాగా కనిపించడంతో అతడి ఫోటో తీసి ఆయన కుటుంబ సభ్యులకు పంపారు. దీంతో తన తమ్ముడు మురళీ యాదవ్, గంగా సాగర్ కుటుంబంతో కలిసి కుంభమేళాకు చేరుకున్నారు.
మురళీ యాదవ్ ప్రకారం.. ‘‘చాలా సంవత్సరాల క్రితం తప్పిపోయిన మా సోదరుడిని కనుగొనే ఆశను అప్పుడు మేము కోల్పోయాము. కానీ కుంభమేళాకు వెళ్ళిన మా బంధువు ఒకరు గంగాసాగర్ లాగా కనిపించే వ్యక్తిని చూశారు. అతను తన ఫోటో తీసి మాకు పంపాడు. ఆ ఫోటో చూసిన తర్వాత, మురళీ యాదవ్, ధన్వా దేవి, వారి ఇద్దరు కుమారులు అతన్ని తిరిగి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో కుంభమేళాకు బయలుదేరారు.’’ అని తెలిపారు. అ అయితే, బాబా రాజ్కుమార్ను కుంభమేళాలో కలిసిన తర్వాత గంగాసాగర్ యాదవ్గా తన పాత గుర్తులను అంగీకరించడానికి నిరాకరించాడు. అతను తనను తాను వారణాసికి చెందిన సాధువుగా చెప్పుకున్నాడు. తన గత జీవితానికి ప్రస్తుత జీవితానికి ఎటువంటి సంబంధం లేదని ఖండించాడు.
ఆ కుటుంబం ఆయన గంగాసాగర్ అని పట్టుబట్టింది. వారు తన పొడవాటి దంతాలు, నుదిటిపై ఒక మచ్చ, అతని మోకాలిపై ఒక గుర్తులను కనుగొన్నారు.అతడి నిజస్వరూపాన్ని నిర్ధారించడానికి డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని ధన్వా దేవి, మురళీ యాదవ్ డిమాండ్ చేశారు. ‘కుంభమేళా ముగిసే వరకు మేము వేచి ఉంటాము. అవసరమైతే DNA పరీక్ష కోసం పట్టుబడతాము’ అని మురళీ యాదవ్ అన్నారు.
కొంతమంది కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చారు. మరికొందరు జాతరలోనే ఉన్నారు. వారు బాబా రాజ్కుమార్ , అతని తోటి సాధ్విపై నిఘా పెట్టారు. కుంభమేళా ముగిసిన తర్వాత, DNA పరీక్ష వారి వాదనలను నిర్ధారిస్తే, వారు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గంగాసాగర్ అదృశ్యం యాదవ్ కుటుంబంపై, ముఖ్యంగా అతని చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆ సమయంలో అతని పెద్ద కొడుకు వయసు కేవలం రెండు సంవత్సరాలు, చిన్న కొడుకు ఇంకా పుట్టలేదు. ఈ సంఘటన అతని జీవితంలో ఒక పెద్ద షాక్ లాంటిది. ఇది అతనికి చాలా కష్టమైన సమయం. ధన్వా దేవి తన పిల్లలను ఒంటరిగా పెంచాల్సి వచ్చింది.
గంగాసాగర్ అదృశ్యం అతని కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా కుంగదీసింది. అతని భార్య ఒంటరిగా ఇద్దరు చిన్న పిల్లల బాధ్యతను మోయవలసి వచ్చింది. అతని సోదరుడు మురళి యాదవ్ తన సోదరుడి కోసం సంవత్సరాల తరబడి ఎలా వెతుకుతూ ఉన్నాడో చెప్పాడు. కుంభమేళా వంటి భారీ కార్యక్రమాలకు ప్రజలు తమ కోల్పోయిన ప్రియమైన వారిని కనుగొనే ఆశతో వస్తారని ఈ సంఘటన కూడా చూపించింది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: A man who disappeared 27 years ago is seen as a hermit in kumbh with his family
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com